ఇరాన్ గడ్డపై భారత్ రహస్య వ్యూహం.. హోర్ముజ్ జలసంధిలో ఆగని నౌకల ప్రయాణం.. !
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ యుద్ధ రంగంలోకి దిగడంతో, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి దిగ్బంధానికి గురైంది. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలో 20 శాతం ఈ ఇరుకైన మార్గం గుండానే జరుగుతుంది. ఏప్రిల్ 9న తాత్కాలిక కాల్పుల విరమణ జరిగినప్పటికీ, ఈ మార్గంలో అంతర్జాతీయ నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగి, ఆర్థిక అస్థిరత ఏర్పడింది.

హోర్ముజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ, భారత నౌకలు సురక్షితంగా ప్రయాణిస్తూ దేశ ఇంధన అవసరాలను తీరుస్తున్నాయి. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యంత వ్యూహాత్మక, రహస్య సమన్వయ విధానం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ యుద్ధ రంగంలోకి దిగడంతో, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి దిగ్బంధానికి గురైంది. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలో 20 శాతం ఈ ఇరుకైన మార్గం గుండానే జరుగుతుంది. ఏప్రిల్ 9న తాత్కాలిక కాల్పుల విరమణ జరిగినప్పటికీ, ఈ మార్గంలో అంతర్జాతీయ నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగి, ఆర్థిక అస్థిరత ఏర్పడింది.
అంతర్జాతీయ ఆపరేటర్లు భయంతో ఈ మార్గాన్ని విస్మరిస్తున్న వేళ, భారతదేశం మాత్రం తన నౌకల ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. దీని వెనుక విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ద్వారా ఇరాన్తో నడుస్తున్న దౌత్యపరమైన సమన్వయం ఉందని ఓడరేవుల, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఒపేష్ కుమార్ శర్మ వెల్లడించారు.
సున్నితమైన భద్రతా కారణాల దృష్ట్యా పూర్తి కార్యాచరణ వివరాలను వెల్లడించనప్పటికీ, కేంద్రంలోని కీలక మంత్రిత్వ శాఖలైన పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ, ఎరువుల మంత్రిత్వ శాఖలతో కలిసి సంయుక్తంగా నౌకల ప్రాధాన్యతను నిర్ణయిస్తున్నట్లు ఆయన తెలిపారు. అత్యవసర ఇంధనం, నిత్యావసరాలు ఉన్న నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడమే ఈ వ్యూహం ముఖ్య ఉద్దేశం.
ప్రస్తుతం హోర్ముజ్ ప్రాంతంలో భారత్కు చెందిన 13 నౌకలు ఉన్నాయి. ఇందులో ఒక LPG ట్యాంకర్, ఐదు ముడి చమురు ట్యాంకర్లు, ఒక రసాయన ట్యాంకర్, కంటైనర్ నౌకలు ఉన్నాయి. ఫిబ్రవరి 28 నుండి ‘శివాలిక్’, ‘నందా దేవి’, ‘జగ్ లాడ్కి’ వంటి పలు భారతీయ నౌకలు విజయవంతంగా ఈ మార్గాన్ని దాటాయి.
అయితే, పబ్లిక్ షిప్ ట్రాకర్ల వల్ల నౌకల భద్రతకు ముప్పు ఉందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, ఇవి వాణిజ్యపరమైన అప్లికేషన్లని, బహిరంగ డేటాను ఎవరైనా ఉపయోగించుకోవచ్చని, కానీ ప్రస్తుతానికి ఈ సమాచారం నౌకలను గుర్తించడానికి తమకు కూడా సహాయపడుతోందని శర్మ పేర్కొన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లోనూ భారత్ చూపుతున్న ఈ చొరవ దేశ ఇంధన భద్రతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
