బ్రాహ్మణులను కించపరిచిందని.. యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు..

పలు టీవీ షోలు వివాదాలకు దారితీస్తుంటాయి. అలా ఒక్కోసారి యాంకర్లపై కూడా పోలీసులు కేసులు నమోదవుతాయి. అలానే ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ - రన్నరప్, ప్రముఖ టాలీవుడ్ యాంకర్ శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు..

బ్రాహ్మణులను కించపరిచిందని.. యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు..
Follow us

| Edited By:

Updated on: May 05, 2020 | 8:00 PM

పలు టీవీ షోలు వివాదాలకు దారితీస్తుంటాయి. అలా ఒక్కోసారి యాంకర్లపై కూడా పోలీసులు కేసులు నమోదవుతాయి. అలానే ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ – రన్నరప్, ప్రముఖ టాలీవుడ్ యాంకర్ శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ విషయం తెలిసిన ఆమె ఫ్యాన్స్ షాక్‌కి గురయ్యారు. అసలు ఈమెపై పోలీస్ కేసు నమోదు కావడానికి కారణమేంటి? ఏం చేసిందంటూ ఆరాలు తీస్తున్నారు. నల్లకుంటకి చెందిన శర్మ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు యాంకర్ శ్రీముఖి, ఓ ఛానెల్‌పై కేసు నమోదు చేశారు.

ఓ ప్రముఖ టీవీ ఛానెల్లో జరిగే ఓ కార్యక్రమంలో శ్రీముఖి బ్రాహ్మణులను అవమాన పరిచినందుకు నల్లకుంటకు చెందిన శర్మ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కార్యక్రమ వీడియోలను కూడా చూపించాడు. బ్రాహ్మణులను కించపరిచే విధంగా కామెడీ షోలో దృశ్యాలను చిత్రీకరించారని ఓ ప్రముఖ టీవీ ఛానెల్, యాంకర్ శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. కామెడీ షోలో బ్రాహ్మణులను కించపరుస్తూ ఉన్నారంటూ వెంకట రమణ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. కాగా ఈ ఘటను సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ వివాదంపై శ్రీముఖి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read More:

సిటీ డీసీపీకి కరోనా.. పోలీసుల్లో మొదలైన కలవరం!

పేగులపై కరోనా వైరస్ దాడి.. మళ్లీ ఇదో కొత్త టెన్షన్!

తెలంగాణలో జూన్ 12 నుంచి స్కూల్స్ ఓపెన్.. ఒక్కో గదిలో 20 మందే!