AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవ్వుల వెనుక దాగిన విషాదం.. మిమిక్రీ మూర్తి చివరి రోజులు దారుణం!

నవ్వుల వెనుక దాగిన విషాదం.. మిమిక్రీ మూర్తి చివరి రోజులు దారుణం!

Phani CH
|

Updated on: Jun 24, 2026 | 11:18 AM

Share

బుల్లితెరపై తన మిమిక్రీ, కామెడీతో ప్రేక్షకులను అలరించిన మిమిక్రీ మూర్తి జీవితం విషాదాంతమైంది. ప్యాంక్రియాస్ క్యాన్సర్‌తో మూడేళ్లపాటు పోరాడిన ఆయన వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఆరోగ్యం క్షీణించింది. కష్టాల్లో ఉన్నవారిని తక్కువ అంచనా వేయొద్దని తన చివరి ఇంటర్వ్యూలో చెప్పిన మూర్తి, 2022లో కన్నుమూశారు. ఆయన జ్ఞాపకాలు అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

బుల్లితెరపై, వందలాది వేదికలపై అద్భుతమైన మిమిక్రీతో, నవ్వులతో అలరించిన నటుడు మిమిక్రీ మూర్తి గుర్తున్నారా? జబర్దస్త్‌లో తనదైన కామెడీతో ఆయన ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. కానీ, అందరినీ నవ్వించిన ఆ కమెడియన్ జీవితంలో ఒక పెద్ద విషాదం దాగుంది. 2019లో ఆయనకు ప్యాంక్రియాస్ క్యాన్సర్ సోకింది. ఆ భయంకరమైన మహమ్మారి కారణంగా ఆయన శరీరం పూర్తిగా చిక్కిపోయింది, నడవలేని స్థితిలో బెడ్‌కే పరిమితమయ్యారు. వైద్యం కోసం దాదాపు 16 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇండస్ట్రీ నుండి రోజా, మరికొందరు దాతలు సహాయం చేసినప్పటికీ పరిస్థితి చేజారిపోయింది. తన చివరి ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారంటే.. కష్టాల్లో ఉన్నప్పుడు “ఆయన అయిపోయాడు” అని తీర్పులు ఇవ్వకండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చివరికి విధితో జరిగిన పోరాటంలో ఓడిపోయి, 2022 సెప్టెంబర్ 27న మూర్తి గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. తన కామెడీతో అందర్నీ నవ్వించిన మూర్తిని ఇప్పటికీ ఆయన అభిమానులు తలుచుకుంటూనే ఉంటారు. ఆయనకు కన్నీటి నివాళులు అర్పిస్తూనే ఉంటారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘చావు అంచున ఉన్నాను.. నన్ను కాపాడండి’..

పెద్ది గాడి OTT ఎంట్రీ.. డేట్ ఫిక్స్? గెట్ రెడీ…!

OTT గైడ్ ఈ ఒక్కవారం ఓటీటీల్లో 21 మూవీస్..

బ్లాక్‌ మిల్క్.. ప్రకృతి వింత! ఆశ్చర్యపరిచే శాస్త్రీయ నిజం

భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్‌ ఇది!

Follow Us