పైలెట్లకు స్పైస్జెట్ షాక్.. ఏప్రిల్, మే జీతాలు కట్..
కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్డౌన్ విధించాయి. ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. అయితే.. విమాన పైలెట్లకు స్పైస్జెట్ షాకిచ్చింది. వారికి ఏప్రిల్, మే నెల వేతనాలు చెల్లించడం
SpiceJet: కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్డౌన్ విధించాయి. ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. అయితే.. విమాన పైలెట్లకు స్పైస్జెట్ షాకిచ్చింది. వారికి ఏప్రిల్, మే నెల వేతనాలు చెల్లించడం లేదని ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సరకు రవాణా విమానాలు నడుపుతున్న పైలట్లకు మాత్రం, పనిచేసిన గంటల ఆధారంగా చెల్లింపులు చేస్తామని తెలిపింది.
కాగా.. లాక్ డౌన్ వేళ మొత్తం విమానాల్లో 16% మాత్రమే నడుస్తున్నాయని, 20 శాతం మంది పైలెట్లు మాత్రమే విధుల్లో ఉన్నారని స్పైస్జెట్ విమాన కార్యకలాపాల చీఫ్ గురుచరణ్ అరోరా పేర్కొన్నారు. 5 కార్గో విమానాలు నిర్వహిస్తుతున్నామని, ప్రయాణికుల విమానాల్లో సీట్లపైనే సరకు రవాణా చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: కరోనా ఎఫెక్ట్: ప్రమాదంలో..160 కోట్ల మంది ఉద్యోగాలు..