లాభాల్లో స్టాక్మార్కెట్లు
ముంబయి : స్టాక్మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా లాభపడగా.. నిఫ్టీ 11,100 మార్క్ వద్ద కదలాడుతోంది. ఎలక్షన్ నొటిపికేషన్ రావడం, వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రస్తుత కూటమే మళ్లీ అధికారంలోకి రావొచ్చన్న అంచనాలకు తోడు అమెరికా, చైనాల మధ్య వచ్చే నెల ప్రారంభంలో వాణిజ్య ఒప్పందం కుదరొచ్చన్న ఆశలు సైతం మార్కెట్లకు కలిసొస్తున్నాయి. కొనుగోళ్ల మద్దతు లభించడంతో దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, లోహ, ఎనర్జీ, […]
ముంబయి : స్టాక్మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా లాభపడగా.. నిఫ్టీ 11,100 మార్క్ వద్ద కదలాడుతోంది. ఎలక్షన్ నొటిపికేషన్ రావడం, వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రస్తుత కూటమే మళ్లీ అధికారంలోకి రావొచ్చన్న అంచనాలకు తోడు అమెరికా, చైనాల మధ్య వచ్చే నెల ప్రారంభంలో వాణిజ్య ఒప్పందం కుదరొచ్చన్న ఆశలు సైతం మార్కెట్లకు కలిసొస్తున్నాయి. కొనుగోళ్ల మద్దతు లభించడంతో దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి.
ప్రభుత్వరంగ బ్యాంకులు, లోహ, ఎనర్జీ, ఆటోమొబైల్ షేర్లు 1 శాతం కంటే ఎక్కువ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.45 నిమిషాలకు సెన్సెక్స్ 280 పాయింట్లకుపైగా లాభంతో 36,951 వద్ద.. నిఫ్టీ 88 పాయింట్లకుపైగా లాభంతో 11,123 వద్ద ట్రేడవుతోంది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 69.91 వద్ద కొనసాగుతోంది. భారతీ ఇన్ఫ్రాటెల్, ఐషర్ మోటార్స్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. సిప్లా, ఇండస్ఇండ్బ్యాంక్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో నమోదవుతున్నాయి.