AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైసీపీలో చేరిన దేవినేని ఉమా సోదరుడు చంద్రశేఖర్‌

హైదరాబాద్‌:కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించడంతో వలసల పర్వం మరింత పెరిగింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమామహేశ్వరరావుకు ఊహించని షాక్‌ తగిలింది. ఆయన సోదరుడు దేవినేని చంద్రశేఖర్ సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వసంత కృష్ణప్రసాద్‌తో కలిసి దేవినేని చంద్రశేఖర్ లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. పార్టీ కండువా కప్పి జగన్ చంద్రశేఖర్‌ను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనేక రకాల కారణాలు వల్ల పార్టీ మరాల్సి వచ్చిందని […]

వైసీపీలో చేరిన దేవినేని ఉమా సోదరుడు చంద్రశేఖర్‌
Ram Naramaneni
|

Updated on: Mar 11, 2019 | 11:15 AM

Share

హైదరాబాద్‌:కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించడంతో వలసల పర్వం మరింత పెరిగింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమామహేశ్వరరావుకు ఊహించని షాక్‌ తగిలింది. ఆయన సోదరుడు దేవినేని చంద్రశేఖర్ సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వసంత కృష్ణప్రసాద్‌తో కలిసి దేవినేని చంద్రశేఖర్ లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. పార్టీ కండువా కప్పి జగన్ చంద్రశేఖర్‌ను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనేక రకాల కారణాలు వల్ల పార్టీ మరాల్సి వచ్చిందని చెప్పారు.

అధికార పార్టీ దోపిడీ ఎక్కువగా ఉందని, పట్టిసీమ ఇరిగేషన్ లాంటి ప్రాజెక్టుల్లో దోపిడీ అధికంగా ఉందని ఆరోపించారు. కేసుల నుండి టీడీపీ నేతలు బయటపడలేరని అన్నారు. రామణుడి లంక నుండి విభీషణడు బయటకు వచ్చినట్లు దేవినేని ఉమ నుండి దేవినేని చంద్రశేఖర్ బయటకు వచ్చారని వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. దేవినేని చంద్రశేఖర్, తాను ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమను అణగదొక్కాలని మంత్రి దేవినేని ఉమ చూస్తున్నారని ఆరోపించారు.