AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతురి మృతదేహాన్ని మంచంపై ఉంచి 35 కి.మీ. కాలినడక, మధ్యప్రదేశ్ లో ఓ తండ్రి దీనావస్థ ! వీడియోను చూసి నెటిజన్ల ఆవేదన

మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీ జిలాల్లో తన కూతురి మృతదేహాన్ని మంచంపై ఉంచి 35 కిలోమీటర్ల దూరం కాలినడకన సుదీర్ఘ ప్రయాణం సాగించాడు ఓ తండ్రి..

కూతురి మృతదేహాన్ని మంచంపై ఉంచి 35 కి.మీ. కాలినడక, మధ్యప్రదేశ్ లో ఓ తండ్రి దీనావస్థ ! వీడియోను చూసి నెటిజన్ల ఆవేదన
Man Walks With Daughter's Body
Umakanth Rao
| Edited By: |

Updated on: May 09, 2021 | 8:18 PM

Share

మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీ జిలాల్లో తన కూతురి మృతదేహాన్ని మంచంపై ఉంచి 35 కిలోమీటర్ల దూరం కాలినడకన సుదీర్ఘ ప్రయాణం సాగించాడు ఓ తండ్రి.. జిల్లా ఆసుపత్రిలో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం కోసం తీసుకువెళ్లేందుకు ఏడు గంటలు ఇలా నడిచాడు. ఇద్దరు, ముగ్గురు గ్రామస్థులు కూడా ఆయనకు సహకరించారు. 16 ఏళ్ళ ఇతని కూతురు ఈ నెల 5 న సూసైడ్ చేసుకుంది. గడాయి అనే ఈ గ్రామంలో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు ఇక్కడికి వచ్చి ఈ యువతి మృతదేహానికి జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయాల్సి ఉందని, అక్కడికి తీసుకురావాలని చెప్పి వెళ్లిపోయారు. అయితే ఆసుపత్రి సుమారు 35 కి.మీ. దూరంలో ఉంది. నిరుపేద అయిన ఈమె తండ్రికి తన కూతురు డెడ్ బాడీని తరలించేందుకు ఏ వాహనాన్నీ సమకూర్చుకోలేకపోయాడు. పైగా అధికారులు కూడా తాము వాహనాన్ని ఏర్పాటు చేయలేమని, అది నువ్వే చూసుకోవాలని చెప్పి చేతులెత్తేశారు. దాంతో ఈ తండ్రి తన కుమార్తె డెడ్ బాడీని మంచం మై వేసుకుని కాలినడకన బయల్దేరాడు, ఉదయం 9 గంటలకు బయల్దేరి సాయంత్రం సుమారు 4 గంటలకు జిల్లా ఆసుపత్రికి చేరాడట.. ఈ వీడియో ఎంతో దయనీయంగా ఉందని, ఆ నిర్భాగ్య పేద తండ్రికి ఎన్ని కష్టాలువచ్చాయని నెటిజన్లు వాపోతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: చైనా దుందుడుకు చర్య, భారీ రాకెట్ ‘పతనం’పై నాసా ఆగ్రహం, బాధ్యతా రాహిత్య ప్రమాణాలకు మీదే బాధ్యత అంటూ విమర్శ

Telangana Covid-19: కొనసాగుతున్న కరోనా విజృంభణ.. తాజాగా ఎన్ని కేసులు, మరణాలు నమోదయ్యాయంటే?

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి