AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Covid-19: కొనసాగుతున్న కరోనా విజృంభణ.. తాజాగా ఎన్ని కేసులు, మరణాలు నమోదయ్యాయంటే?

Coronavirus Updates in Telangana: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. తెలంగాణలో కూడా కోవిడ్-19 కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతోపాటు

Telangana Covid-19: కొనసాగుతున్న కరోనా విజృంభణ.. తాజాగా ఎన్ని కేసులు, మరణాలు నమోదయ్యాయంటే?
Telangana Corona
Shaik Madar Saheb
|

Updated on: May 09, 2021 | 8:05 PM

Share

Coronavirus Updates in Telangana: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. తెలంగాణలో కూడా కోవిడ్-19 కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 55,358 నమూనాలను పరీక్షించగా 4976 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,97,361కి పెరిగింది. దీంతోపాటు ఈ కరోనా మహమ్మారి కారణంగా 35 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకూ మరణించిన వారిసంఖ్య 2,739కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

కాగా.. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో కరోనా నుంచి 7,646 మంది బాధితులు కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,28,865 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 65,757 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 86.22శాతం ఉండగా.. మరణాల రేటు 0.55శాతంగా ఉంది.

అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 851 కేసులు నమోదు అయ్యాయి. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 384, మహబూబ్‌నగర్‌లో 208 కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. కాగా.. నిన్న నమోదైన కేసులతో పోల్చుకుంటే..తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కొంతమేర తగ్గింది. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా రాత్రివేళ కర్ఫ్యూను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:

YS sharmila: కేసీఆర్ దొర.. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చండి.. వైఎస్ షర్మిల డిమాండ్

Coronavirus: తెలంగాణ‌లోని ఈ గ్రామంలో ఒక్క క‌రోనా కేసు కూడా లేదు.. కార‌ణాలు ఏంటంటే