కంగనా, రంగోలీలకు మరోసారి సమన్లు
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలికి ముంబయిలోని బాంద్రా పోలీసులు మరోసారి సమన్లు జారీ చేశారు.
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలికి ముంబయిలోని బాంద్రా పోలీసులు మరోసారి సమన్లు జారీ చేశారు. నవంబరు 9,10 తేదీల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అంతకుముందు అక్టోబర్ 26, 27న విచారణకు హాజరుకావాల్సిందిగా కంగనా సిస్టర్స్కు సమన్లు పంపారు పోలీసులు. అయితే అప్పుడు వారిద్దరు గైర్హాజరయ్యారు. వారి సోదరుడి పెళ్లి సందర్భంగా విచారణకు రాలేకపోయారంటూ కంగన తరఫు లాయర్ జమీందర్ పోలీసులకు లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో వారికి మరోసారి సమన్లు పంపారు ముంబయి పోలీసులు.
కంగనా సిస్టర్స్ బాలీవుడ్ పేరును దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిట్నెస్ ట్రైనర్ సయ్యద్ కేసు పెట్టారు. మతపరమైన గొడవలు సృష్టించేలా సోషల్మీడియా వేదికగా మాట్లాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. నెపోటిజమ్, డ్రగ్స్ గురించి కూడా వారి వ్యాఖ్యలు అభ్యంతరకరమని పేర్కొన్నారు. కంగనా సిస్టర్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ముంబయి పోలీసులు కంగనా సిస్టర్స్పై కేసు నమోదు చేసి వారిని విచారణకు రావాలని నోటీసులు పంపారు.
Also Read :