AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha: ఏదోటి క్రేజీగా చేయకుండా.. ఈమె ఉండదుగా..

Trisha: ఏదోటి క్రేజీగా చేయకుండా.. ఈమె ఉండదుగా..

Phani CH
|

Updated on: Apr 25, 2026 | 10:06 AM

Share

తమిళనాడు ఎన్నికల పోలింగ్ ముగిసింది. విజయ్ 'తమిళగ వెట్రి కళగం' పార్టీ బరిలోకి దిగింది. సినీ ప్రముఖులు ఓటు వేసిన వారిలో విజయ్, త్రిష ఉన్నారు. అయితే, త్రిష తన ఓటు వేసిన ఫోటోను 'ఘిల్లి' సినిమాలోని విజిల్ పాటతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం సంచలనంగా మారింది. విజయ్ పార్టీ గుర్తు విజిల్ కావడంతో, ఇది విజయ్‌కు మద్దతుగా ఇచ్చిన సంకేతమని నెటిజన్లు భావిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా ఎంతో ఉత్కంఠ రేపిన తమిళనాడు ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఈసారి డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగింది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయ్ పార్టీ పోటీ చేస్తోంది. ఇక విజయ్‌ కూడా తిరుచురాపల్లి ఈస్ట్‌, పెరంబూర్‌ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఏప్రిల్ 23న జరిగిన పోలింగ్ లో భారీ ఓటింగ్ నమోదైంది. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీవీకే అధినేత హీరో విజయ్, రజనీకాంత్, అజిత్, ధనుష్, శ్రుతి హాసన్, కమల్ హాసన్, త్రిష, ఖుష్బూ, శివ కార్తికేయన్, డైరెక్టర్ అట్లీ, ఇంకా ఇతర ప్రముఖులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. వీరిలో అందరి దృష్టిని ఆకర్షించింది త్రిష అని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా విజయ్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లకు బలం చేకూరుస్తూ ఇద్దరూ కూడా జంటగా ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. దీంతో వీరు కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఓటు వేయడానికి వచ్చిన త్రిషపై మీడియా ప్రత్యేక దృష్టి‌ పెట్టింది. అయితే త్రిష మాత్రం సింపుల్‌గా తన తల్లితో వచ్చి ఓటు వేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత సైలెంట్‌గా ఓ క్రేజీ బాంబు వేసేసింది. చెన్నైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన త్రిష, ఆ తర్వాత తన వేలికి ఉన్న సిరా చుక్కను మీడియాకు చూపిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాసేపటికే అదే ఫొటోని తన ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో షేర్‌ చేసింది త్రిష. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ ఫొటోకు ఆమె జోడించిన పాట ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఆ సాంగ్ మరేదో కాదు విజయ్‌- త్రిష జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘గిల్లి’లోని ‘అర్జునర్ విల్లు’ అనే పాట. ఈ సాంగ్ ఒక్కటే కాదు.. అందులో కేవలం ‘విజిల్స్’వినిపించే భాగాన్ని మాత్రమే ఆమె తన పోస్ట్‌కి జత చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. విజయ్ టీవీకే పార్టీ గుర్తు విజిల్. ఈ క్రమంలోనే త్రిష ఆ పాట, విజిల్ తో ఫొటో షేర్ చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విజయ్‌కు మద్దతు తెలపడానికే త్రిష ఈ పాటను జత చేశారని అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET: ఇంటర్నేషల్‌ వేదికపై ‘వారణాసి’ రిలీజ్‌ !! AA23 రేంజ్‌ ఊహించలేరు..

Follow Us