అనంతపురంలో అమాయకులను హనీ ట్రాప్ ద్వారా మోసం చేసి కోటి రూపాయలు వసూలు చేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన నిందితురాలు రంగమ్మ నాయుడు సహా ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.13 లక్షల నగదు, ఫోన్లు, ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి 20 మంది బాధితుల నుంచి ఈ ముఠా భారీగా డబ్బులు లాగిందని దర్యాప్తులో తేలింది.