క్రేజీ ఆఫర్ కొట్టేసిన పూర్ణ !
ప్రజంట్ బాలయ్య-బోయపాటి కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి కారణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.
ప్రజంట్ బాలయ్య-బోయపాటి కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి కారణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్కి చోటుంది. ఈ క్రమంలో మలయాళీ భామ ప్రయాగ మార్టిన్ను ఇప్పటికే కన్ఫామ్ చేశారు. రెండో నాయికగా పూర్ణ ఛాన్స్ దక్కించుకుంది. కాగా ఈ మూవీ నుంచి మరో ఆసక్తికర అప్డేట్ బయటకొచ్చింది. ఇందులో మరో నందమూరి హీరో తారకరత్న నటిస్తున్నారని సమాచారం. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఓ రాజకీయ నాయకుడిగా ఆయన కనిపించనున్నారట.
ఇటీవలే హైదరాబాద్లో పునఃప్రారంభమైన ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తారు. కొన్ని సన్నివేశాల్లో అఘోరాగా ఆయన సందడి చేయనున్నట్టు సమాచారం. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఫస్ట్ రోర్’కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. గతంలో ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్బాస్టర్స్ అందించారు బాలయ్య-బోయపాటి. మరి ఈ సారి మూవీతో హ్యాట్రిక్ కొడతారో, లేదో చూడాలి.
Also Read : భాగ్యనగరంలో జల సిరి..భారీగా పెరిగిన గ్రౌండ్ వాటర్