AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ20 మ్యాచ్ రద్దు.. ఫ్యాన్స్ ‘వందేమాతరం’ హిట్టు..!

నిన్న గౌహతిలో జరగాల్సిన భారత్, శ్రీలంక మధ్య మొదటి టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా.. మ్యాచ్ మొదలయ్యే ముందు వర్షం రావడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. అయితే కొద్దిసేపటికి వరుణుడు కరుణించినా.. గ్రౌండ్ స్టాఫ్ నిర్వహణ లోపం కారణంగా ఒక్క బంతి పడకుండానే ఈ మ్యాచ్ రద్దు అయింది. అయితే మ్యాచ్ మొదలయ్యే ముందు ఫ్యాన్స్ అందరూ కలిసి స్టేడియం దద్దరిల్లిపోయేలా ‘వందేమాతరం.. వందేమాతరం’ అంటూ ఆలపించిన దేశభక్తి గీతం […]

టీ20 మ్యాచ్ రద్దు.. ఫ్యాన్స్ 'వందేమాతరం' హిట్టు..!
Ravi Kiran
|

Updated on: Jan 06, 2020 | 5:34 PM

Share

నిన్న గౌహతిలో జరగాల్సిన భారత్, శ్రీలంక మధ్య మొదటి టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా.. మ్యాచ్ మొదలయ్యే ముందు వర్షం రావడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. అయితే కొద్దిసేపటికి వరుణుడు కరుణించినా.. గ్రౌండ్ స్టాఫ్ నిర్వహణ లోపం కారణంగా ఒక్క బంతి పడకుండానే ఈ మ్యాచ్ రద్దు అయింది.

అయితే మ్యాచ్ మొదలయ్యే ముందు ఫ్యాన్స్ అందరూ కలిసి స్టేడియం దద్దరిల్లిపోయేలా ‘వందేమాతరం.. వందేమాతరం’ అంటూ ఆలపించిన దేశభక్తి గీతం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా.. నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్లు చేయడమే కాకుండా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సో మ్యాచ్ రద్దయ్యి నిరాశ చెందిన ఫ్యాన్స్.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఉత్తేజం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. కాగా, ఇరు జట్ల మధ్య రెండో టీ20 మంగళవారం ఇండోర్ వేదికగా జరగనుంది.