కర్నూలు కేఎస్‌ కేర్‌ ఆస్పత్రిలో దారుణం.. నలుగురు కరోనా రోగులు మృతి.. ఆక్సిజన్‌ అందకే చనిపోయారంటున్న బాధిత బంధువులు

Kurnool K. S. Care Hospital: కర్నూలు జిల్లా కేఎస్‌ కేర్‌ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. కేఎస్‌ కేర్‌ ఆస్పత్రిలో నలుగురు కరోనా బాధితులు మృతి చెందారు. అయితే.

కర్నూలు కేఎస్‌ కేర్‌ ఆస్పత్రిలో దారుణం.. నలుగురు కరోనా రోగులు మృతి.. ఆక్సిజన్‌ అందకే చనిపోయారంటున్న బాధిత బంధువులు
Follow us

|

Updated on: May 01, 2021 | 4:21 PM

Kurnool K. S. Care Hospital: కర్నూలు జిల్లా కేఎస్‌ కేర్‌ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. కేఎస్‌ కేర్‌ ఆస్పత్రిలో నలుగురు కరోనా బాధితులు మృతి చెందారు. అయితే ఆక్సిజన్‌ అందక చనిపోయారంటూ మృతుల బంధువులు ఆరోపిస్తుండగా, ఇతర కారణాలతో చనిపోయారని ఆస్పత్రి యజమాని డాక్టర్‌ శాస్త్రి చెబుతున్నారు. అయితే అనుమతి లేకుండా ఆస్పత్రి యాజమాన్యం కరోనా చికిత్స అందిస్తుందని బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు. ఆక్సిజన్‌ కొరత ఉన్న విషయం వాస్తవమేనని, అందుకే రోగులను ఇతర ఆస్పత్రికి వెళ్లాలని సూచించామని ఆయన చెబుతున్నారు. కోవిడ్‌ ఆస్పత్రి కోసం అనుమతి కోరామని, ఇంకా రాలేదని ఆస్పత్రి యజమాని డాక్టర్‌ శాస్త్రి తెలిపారు. అయితే బాధిత బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆస్పత్రి ఎండీని ప్రశ్నిస్తున్నారు. ఆక్సిజన్‌ అందకపోవడంతోనే కరోనా పేషెంట్లు మృతి చెందారని పోలీసుల ముందు బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆస్పత్రి ముందు రోగుల బంధువులు ఆందోళనకు దిగారు.

కాగా, కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఉంది. సరైన సమయానికి ఆక్సిజన్‌ అందక చాలా మంది రోగులు మృత్యువాత పడుతున్నారు. ఒక వైపు కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఆక్సిజన్‌, ఆస్పత్రుల్లో బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.

ఇవీ చదవండి:

Etela Rajender: మంత్రి ఈటల రాజేందర్‌పై వేటుకు రంగం సిద్ధం.. వైద్య ఆరోగ్యశాఖను కేసీఆర్‌కు బదిలీ.. గవర్నర్‌ ఆమోదం

WHO Warning: భారత్‌లో ఉన్న పరిస్థితులు ఎక్కడైనా జరగవచ్చు.. ఐరోపా దేశాలను హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో

Central Government: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం

Latest Articles
టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ గోవిందా! అందులో మాత్రం..
టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ గోవిందా! అందులో మాత్రం..
భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లోనే
భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లోనే
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. హైకోర్టు కీలక సూచన..
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. హైకోర్టు కీలక సూచన..
'రోహిత్‌ వేముల దళితుడు కాదు.. ఈ కేసును మూసి వేస్తున్నాం' హైకోర్టు
'రోహిత్‌ వేముల దళితుడు కాదు.. ఈ కేసును మూసి వేస్తున్నాం' హైకోర్టు
అమెజాన్‌ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే.. రూ. 8వేలలోనే ఫోన్స్..
అమెజాన్‌ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే.. రూ. 8వేలలోనే ఫోన్స్..
ఓటీటీలోకి రాబోతున్న హారర్ మూవీ షైతాన్.. చూస్తే తడిసిపోవాల్సిందే
ఓటీటీలోకి రాబోతున్న హారర్ మూవీ షైతాన్.. చూస్తే తడిసిపోవాల్సిందే
ఏపీలో పెన్షన్ల పంపిణీపై పరేషాన్.. ఇంటి నుంచి బ్యాంకుకు వయా..
ఏపీలో పెన్షన్ల పంపిణీపై పరేషాన్.. ఇంటి నుంచి బ్యాంకుకు వయా..
మండే ఎండలకు బ్రేక్.. తెలంగాణకు వర్ష సూచన
మండే ఎండలకు బ్రేక్.. తెలంగాణకు వర్ష సూచన
పోటీకి సిద్ధమైంన జాన్వీ కపూర్‌.. దిశా పటాని..
పోటీకి సిద్ధమైంన జాన్వీ కపూర్‌.. దిశా పటాని..
శని వదలట్లేదుగా! టీ20 ప్రపంచకప్ అంపైర్ల లిస్టులో టీమిండియా విలన్
శని వదలట్లేదుగా! టీ20 ప్రపంచకప్ అంపైర్ల లిస్టులో టీమిండియా విలన్