9 రోజుల్లో కోటికి పైగా కరోనా పరీక్షలు

తొమ్మిది రోజుల్లో కోటికిపైగా కరోనా టెస్టులు. పాజిటివ్ కేసుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల. పాజిటివ్ కేసుల శాతంలోను గుర్తించదగిన తగ్గుదల. మొత్తానికి దేశంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టినట్లు నిర్ధారణ అవుతోంది. వీటన్నింటికీ కారణం ఏంటి ?

9 రోజుల్లో కోటికి పైగా కరోనా పరీక్షలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 29, 2020 | 7:11 PM

Crore corona tests in nine days:  దేశంలో ఒకవైపు కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండగా.. మరోవైపు కోవిడ్ పరీక్షల్లో జోరు కనిపిస్తోంది. గత 9 రోజుల్లో ఏకంగా కోటికి పైగా కోవిడ్ టెస్టులు నిర్వహించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వివరాలను వెల్లడించింది. గత ఆరు వారాల యావరేజ్ టెస్టుల సంఖ్యను పరిశీలిస్తే.. అది డెయిలీ 11 లక్షలుగా తేలింది.

గత డిసెంబర్‌లో చైనాలో కరోనా వైరస్ బయట పడిన తర్వాత మన దేశంలో జనవరిలో దాన్ని డయాగ్నైజ్ చేసే విధానాలపై పరిశోధనలు మొదలయ్యాయి. తొలి రోజుల్లో కరోనాను గుర్తించడం కూడా కష్టసాధ్యమైన పరిస్థితి. అయితే ఇది మార్చి తర్వాత ఊపందుకుంది. మార్చి నెలాఖరులో లాక్ డౌన్ విధించడం వెనుక అసలు ఉద్దేశం ఇదేనన్నది పరిశీలకుల అభిప్రాయం.

కరోనా పరీక్షలనే సరిగ్గా చేయలేని స్థితిలో మన దేశంలోకి విచ్చలవిడిగా కరోనా వైరస్ సోకిన వ్యక్తుల వస్తే తలెత్తే పరిణామాలను దృష్టిలో వుంచుకుని లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారు ప్రధాని మోదీ. ఆ తర్వాత లాక్ డౌన్ కాలంలో పరిశోధనల్లో ఊపు మొదలైంది. ఒకవైపు వైరస్‌ను నిర్ధారించే పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచడం.. ఇంకోవైపు దాన్ని నిర్మూలించే మెడిసిన్‌లను వినియోగించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

తొలి నాళ్ళలో తీసుకున్న చర్యల ఫలితాలు ప్రస్తుతం క్లియర్‌గా కనిపిస్తున్నాయి. దానికి నిదర్శనమే ప్రస్తుతం డెయిలీ 11 లక్షల వరకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో 10 కోట్ల 65 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం మన దేశం ప్రతీ రోజు 15 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించే స్థాయికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

అదే సమయంలో చేసిన పరీక్షల్లో పాజిటివ్ కేసుల శాతం తగ్గుతుండడం గమనార్హం. ప్రస్తుతం క్యుములేటివ్ పాజిటివ్ కేసుల శాతం 7.51 కాగా.. గత 9 రోజులుగా జరిపిన పరీక్షల్లో యావరేజ్ పాజిటివ్ కేసుల శాతం కేవలం 4.64 మాత్రమే. తాజా గణాంకాల ప్రకారం దేశంలో 80 లక్షల మందికిపై కరోనా సోకగా.. యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం 6 లక్షల 3 వేల 687 మాత్రమే. 73 లక్షల మందికి పైగా ఇప్పటి వరకు కరోనా సోకి, కోలుకుని ఇంటికి చేరిన వారున్నారు. రికవరీ అయిన వారి సంఖ్యకు, యాక్టివ్ కేసుల సంఖ్యకు తేడా 67 లక్షలకు పైగా వుండడం విశేషం.

Also read: మద్యం ప్రియులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్

Also read:  ధరణీ పోర్టల్ సీక్రెట్ వెల్లడించిన కేసీఆర్

Also read:  చెరుకు రైతులకు మోదీ కేబినెట్ శుభవార్త

Also read: నవంబర్ 2 నుంచి ఏపీ స్కూళ్ళు రీఓపెన్… కండీషన్స్ ఇవే

Also read: ఏపీ సీఎంకు ఉండవల్లి ఉచిత సలహా

Also read: అతి చేయొద్దు సూర్యా.. రవిశాస్త్రి వార్నింగ్