AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కవ్వింపులకు పాల్పడుతున్న చైనా..!

గాల్వన్ నదీ ప్రవాహానికి అడ్డుతగిలే విధంగా చైనా కుట్రలు పన్నుతూనే ఉంది. లడఖ్ ఈశాన్య ప్రాంతంలో దాడికి పక్కా ప్రణాళికతో దాడులకు పాల్పడ్డట్లు ఉపగ్రహా చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.

కవ్వింపులకు పాల్పడుతున్న చైనా..!
Balaraju Goud
| Edited By: |

Updated on: Jun 19, 2020 | 3:58 PM

Share

చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామంటూనే జిత్తుల మారి నక్క చైనా భారత్ పై దాడికి తెగబడుతోంది. పలు దఫాలుగా చర్చలు జరుగుతున్న సమయంలోనే గాల్వాన్ నదీ ప్రాంతంలో 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకుంది. లడఖ్ ఈశాన్య ప్రాంతంలో దాడికి పక్కా ప్రణాళికతో దాడులకు పాల్పడ్డట్లు ఉపగ్రహా చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. గాల్వన్ నదీ ప్రవాహానికి అడ్డుతగిలే విధంగా చైనా కుట్రలు పన్నుతూనే ఉంది.

వందలాది బుల్డోజర్లను ఈ ప్రాంతానికి తరలించి భయానక వాతావరణాన్ని సృష్టించింది. బుల్డోజర్లను గాల్వన్ నది వెంబడి కిలోమీటర్ల పొడవునా మోహరించినట్లు తెలుపుతున్న ఉపగ్రహా ఛాయాచిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా ఆ ప్రాంతంలో వందలాది సైనిక వాహనాలు కూడా మోహరించినట్లు తెలుస్తోంది. సరిహద్దు ఘర్షణల అనంతరం బుధవారం మేజర్ జనరల్ స్థాయి అధికారులు చైనా అధికారులతో చర్చలు జరిపినా ఫలితం లేకుండాపోయింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ మంత్రితో కూడా ఫోన్లో చర్చలు జరిపారు. చైనా దాడులపై తీవ్ర నిరసన తెలిపారు. ఇలాంటి ఘటనలను సహించబోమని స్పష్టం చేశారు.

అయినప్పటికీ చైనా తన వక్రబుద్ధిని మార్చుకోలేదు. గురువారం సరిహద్దు వెంబడి, గాల్వన్ లోయ సమీపం వరకు చైనా దళాలు భారీ ఎత్తున మోహరిస్తున్నాయి. ఓవైపు చర్చలంటూనే చైనా ఇలాంటి కుట్రలకు దిగుతోంది. చైనా చర్యలను గమనించిన భారత్ కూడా సరిహద్దు వెంబడి సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరించింది. ఒక వేళ చైనా దాడికి దిగితే తగినవిధంగా బుద్ది చెప్పేందుకు సిద్ధమైంది. భారత్-చైనా సరిహద్దు వాస్తవాధీన రేఖతోపాటు సముద్ర తీరాల వెంబడి కూడా భారత్ నిఘాను పెంచింది. వాస్తవాధీన రేఖ వెంబడి భారత బలగాలతోపాటు సైనిక వాహనాలను కూడా మోహరించింది. ఒకవేళ చైనా దాడులకు దిగితే ధీటైన సమాధానం చెప్పేందుకు భారత సైనిక దళాలు సిద్ధంగా ఉన్నాయి. భారత్ శాంతినే కోరుకుంటుందని, చైనాకి సరియైన సమయంలో సరియైన విధంగా బుద్ధి చెబుతామని భారత్ ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే స్పష్టం చేశారు.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్