పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
ఒక్క రోజంతా పళ్ళు తోముకోకపోతే ఏమి జరుగుతుందిలే అని కొంతమంది అనుకుంటారు. కానీ ఆరోగ్య నిపుణులు, అధ్యయనాలు ఈ చిన్న పొరబాటు ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నాయి. అవును, రోజుకు ఒకసారి పళ్ళు తోముకోకపోవడం కూడా ప్రమాదకరమేనట. మొత్తం శరీర ఆరోగ్యానికి రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం చాలా అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం తిన్న..

సాధారణంగా శీతాకాలంలో కాస్త బద్ధకంగా ఉంటుంది. పైగా చలికి నీళ్లు ముట్టుకోవడానికి చాలా మంది భయపడుతుంటారు. అందుకే ఈ కాలంలో కొందరు పళ్ళు తోముకోవడం మానేస్తుంటారు. ఇలా ఒక్క రోజంతా పళ్ళు తోముకోకపోతే ఏమి జరుగుతుందిలే అని అనుకుంటారు. కానీ ఆరోగ్య నిపుణులు, అధ్యయనాలు ఈ చిన్న అలవాటు ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నాయి. అవును, రోజుకు ఒకసారి పళ్ళు తోముకోకపోవడం కూడా ప్రమాదకరమేనట. మొత్తం శరీర ఆరోగ్యానికి రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం చాలా అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం తిన్న కేవలం 20 నిమిషాల్లోనే, నోటిలోని బ్యాక్టీరియా, చక్కెర స్టార్చ్ను ఆమ్లంగా మారుస్తుంది. ఈ ఆమ్లం దంతాల బయటి పొరను దెబ్బతీయడం ప్రారంభిస్తుంది. కాబట్టి ఒక రోజంతా పళ్ళు తోముకోకపోతే నోటిలో ఏమి జరుగుతుందో? అది ఎంత ప్రమాదకరమో? ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా ఆహారం తిన్న 4-6 గంటల్లోపు, దంతాలపై ప్లేక్ అనే జిగట పొర ఏర్పడటం ప్రారంభమవుతుంది. 12 గంటల తర్వాత ఈ ప్లేక్ గట్టిపడి టార్టార్గా మారుతుంది. 24 గంటల తర్వాత చిగుళ్ళు ఉబ్బి, రక్తస్రావం, దుర్వాసనకు కారణమవుతాయి. AIIMS దంతవైద్యుల అభిప్రాయం ప్రకారం మీరు ఒక రోజంతా పళ్ళు తోముకోవడం మానేస్తే నోటిలో ఒక మిలియన్ బ్యాక్టీరియా పెరుగుతుందట. ఇది పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
మరణ ప్రమాదం
ది లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. రోజూ పళ్ళు తోముకోని వ్యక్తులకు మరణ ప్రమాదం 25 శాతం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.
గుండె జబ్బుల ప్రమాదం
మీరు ఒక సంవత్సరం పాటు పళ్ళు తోముకోకపోతే గుండె జబ్బుల ప్రమాదం మూడు రెట్లు పెరుగుతుంది. నోటిలోని బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించి ధమనులలో వాపును కలిగిస్తుంది. దీనివల్ల గుండె సమస్యలు వస్తాయి.
శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు
నోటిలోని బాక్టీరియా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు, న్యుమోనియాకు కూడా కారణమవుతుంది.
నోటి క్యాన్సర్
పొగాకు వాడకపోయినా పళ్ళు తోముకోని వారికి నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
దంతక్షయం
ఒక సంవత్సరం పాటు దంతాలు తోముకోకపోతే అవి పూర్తిగా కుళ్ళిపోతాయి. దీనివల్ల దంతక్షయం, తీవ్రమైన చిగుళ్ల నొప్పి వస్తుంది. దంతాలు వదులుగా మారి రాలిపోతాయి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








