AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక మిగిలింది ట్విట్టర్ వార్.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య సవాల్!

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఓ పక్క జరుగుతుంటే.. మరోపక్క బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకి పెరుగుతూ వస్తోంది. ఎన్నికల ప్రచారాలు, మీడియా సమావేశాలు, సోషల్ మీడియా ఇలా ఎక్కడ దొరికితే అక్కడ ఇరు పార్టీలూ మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ఇప్పుడు తాజాగా తమ ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్ ఫొటోలతో రెండు పార్టీలు యుద్ధానికి దిగాయి. రీసెంట్‌గా కోల్‌కతాలో జరిగిన అమిత్ షా ర్యాలీలో కొంతమంది త్రిణమూల్ కాంగ్రెస్ నేతలు విద్యావేత్త ఈశ్వర్ చంద్ర […]

ఇక మిగిలింది ట్విట్టర్ వార్.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య సవాల్!
Ravi Kiran
| Edited By: |

Updated on: May 19, 2019 | 5:32 PM

Share

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఓ పక్క జరుగుతుంటే.. మరోపక్క బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకి పెరుగుతూ వస్తోంది. ఎన్నికల ప్రచారాలు, మీడియా సమావేశాలు, సోషల్ మీడియా ఇలా ఎక్కడ దొరికితే అక్కడ ఇరు పార్టీలూ మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ఇప్పుడు తాజాగా తమ ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్ ఫొటోలతో రెండు పార్టీలు యుద్ధానికి దిగాయి.

రీసెంట్‌గా కోల్‌కతాలో జరిగిన అమిత్ షా ర్యాలీలో కొంతమంది త్రిణమూల్ కాంగ్రెస్ నేతలు విద్యావేత్త ఈశ్వర్ చంద్ర బిద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ చాలామంది బీజేపీ నేతలు తమ ట్విట్టర్ ప్రొఫైల్ ఫోటోగా ఈశ్వర్ చంద్ర బిద్యాసాగర్ ఫోటోను పెట్టుకున్నారు. అలాగే బీజేపీ నేత ప్రగ్యా సింగ్ ఠాకూర్.. మహాత్మా గాంధీని చంపిన గాడ్సేను దేశ భక్తుడిగా పోలుస్తూ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు తమ ట్విట్టర్ ప్రొఫైల్ ఫోటోగా మహాత్మా గాంధీని పెట్టుకున్నారు. ఇలా ఒకరినొకరు చురకలు అంటించుకుంటున్నారు.

మరోవైపు ప్రగ్యా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ సీనియర్ నేత అనంతకుమార్ హెగ్డే మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. దీనితో బీజేపీ సంరక్షణలో పడింది. ప్రధాని మోదీ రంగంలోకి దిగి.. సాధ్వి చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని.. కానీ గాంధీని అవమానించినందుకు ఆమెను క్షమించలేమని అన్నారు.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?