AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ కీలక నిర్ణయం.. రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు..

దేశంలో కోవిద్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఏపీలో రానురాను కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే

జగన్ కీలక నిర్ణయం.. రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 14, 2020 | 5:51 AM

Share

Aarogyasri: దేశంలో కోవిద్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఏపీలో రానురాను కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపును విస్తరిస్తూ సీఎం వైఎస్ జగన్‌‌ ఆదేశాలు జారీచేశారు. దీంతో గురువారం నుంచి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వైద్యం ఖర్చు రూ.వేయి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించ‌నుంది.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ సీఈఓ డా.మల్లికార్జున్‌తో సమావేశమయ్యారు. ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వెంటనే మరిన్ని జిల్లాలకు ఆరోగ్యశ్రీని వర్తింపు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మొత్తంగా 2,200 వైద్య ప్రక్రియలను ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఆరోగ్యశ్రీ బిల్లులను కూడా ఎప్పటికప్పుడు చెల్లించి, మెరుగైన వైద్య సేవలందించేలా నిర్ణ‌యాలు తీసుకున్నారు.

Also Read: యాప్‌ల నిషేధంపై.. చైనాకు ఇండియా ధీటుగా జవాబు