ఉపాధి హామీ పనుల్లో.. దేశంలోనే ఏపీ నంబర్వన్..
దేశంలో కోవిద్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏపీలో రానురాను కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో కూడా 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పని కల్పించామని,
దేశంలో కోవిద్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏపీలో రానురాను కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో కూడా 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పని కల్పించామని, కరోనా కష్టకాలంలో అత్యధికంగా ఉపాధి కల్పించగలిగామని.. ఉపాధి హామీ పనుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్వన్గా నిలిచిందని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ అన్నారు.
కోవిద్-19 సంక్షోభ కాలంలో పని కల్పించి రూ.4 వేల కోట్ల వేతనాలు చెల్లించామని, 57 లక్షల మంది కూలీలకు పని కల్పించామని గిరిజా శంకర్ తెలిపారు. ఒక్క జూన్ నెలలోనే అత్యధికంగా 8 కోట్ల పని దినాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు, నాడు-నేడు పాఠశాలల పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆస్తుల నిర్మాణంలోనూ దేశంలోనే ఏపీని నంబర్వన్ స్థానంలో నిలిపామని, పారదర్శకంగా వేతనాల చెల్లింపుల్లోనూ అందరికంటే ముందంజలో ఉన్నామని గిరిజా శంకర్ వెల్లడించారు.
Also Read: యాప్ల నిషేధంపై.. చైనాకు ఇండియా ధీటుగా జవాబు