AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Win on Cancer: ఆరు సార్లు కేన్సర్.. 12 సార్లు కీమో థెరపీ.. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. వందలాది మందికి స్ఫూర్తి సందేశం!

కేన్సర్  చాలా ప్రమాదకరమైన వ్యాధి. దాని పేరు వినగానే జీవితం చీకట్లో జారిపోయినట్టు అయిపోతుంది. ఈ వ్యాధి బారిన పడి ఎందరో ప్రాణాలను కోల్పోయారు. కొందరు మాత్రం ధైర్యంగా కేన్సర్ తో పోరాటం చేసి ప్రాణాలను దక్కించుకున్నారు.

Win on Cancer: ఆరు సార్లు కేన్సర్.. 12 సార్లు కీమో థెరపీ.. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. వందలాది మందికి స్ఫూర్తి సందేశం!
Win On Cancer
KVD Varma
|

Updated on: Oct 03, 2021 | 5:38 PM

Share

Win on Cancer: కేన్సర్  చాలా ప్రమాదకరమైన వ్యాధి. దాని పేరు వినగానే జీవితం చీకట్లో జారిపోయినట్టు అయిపోతుంది. ఈ వ్యాధి బారిన పడి ఎందరో ప్రాణాలను కోల్పోయారు. కొందరు మాత్రం ధైర్యంగా కేన్సర్ తో పోరాటం చేసి ప్రాణాలను దక్కించుకున్నారు. కేన్సర్ ను ఓడించిన వారిలో ప్రధానంగా మందుల కంటే వారి ధైరమే వారిని సగం రక్షించిందనీ వైద్యులు చెబుతారు. ఎంత మందులు వాడినా.. ఎన్నిరకాల ట్రీట్మెంట్ చేసినా.. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా.. కేన్సర్ బారిన పడినవారు ధైర్యంగా నిలబడకపోతే వారు విజేతలుగా నిలవలేరు. అటువంటి ఒక విజేత కథ ఇది. ఒకసారి.. రెండుసార్లు కాదు.. ఏకంగా వరుసగా ఆరుసార్లు కేన్సర్ బారిన పడ్డాడు అతను.. 12 సార్లు కీమోథెరపీ చేయించుకున్నాడు. ఒక్కసారి కేన్సర్ వస్తేనె జీవితం కోల్పోయే పరిస్థితి ఉంది అటువంటిది ఆరుసార్లు కరోనా వచ్చినా ధైర్యంగా ఎదుర్కుని.. దానినుంచి బయటపడి.. తన ఆత్మవిశ్వాస రహస్యాన్ని పదిమందికీ పంచుతూ.. కేన్సర్ ఎదుర్కోవడంలో వారిని ఉత్సాహంగా ముందుకు నడిపిస్తున్నాడు. 

రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాకు చెందిన  23 ఏళ్ల జయంత్ కండోయ్  మొత్తం భారతదేశంలో క్యాన్సర్‌ను 6 సార్లు ఓడించిన మొదటి వ్యక్తి. జయంత్ కి చిన్నప్పటి నుండి చదువు అంటే చాలా ఇష్టం. అతను పూర్తి హాజరుతో తన పాఠశాలలో టాపర్‌గా ఉండేవాడు. దీనితో పాటు, ఖోఖో ఛాంపియన్, డాన్సర్, సింగర్, జిల్లా స్థాయిలో యాంకరింగ్‌లో కూడా ముందుండేవారు. కానీ, క్యాన్సర్ అనే పురుగు అతని ఆనందమైన జీవితానికి బ్రేక్ వేసింది.  2013 లో మొదటిసారిగా కేన్సర్ అతన్ని ఆక్రమించింది. ఆ తరువాత  పదేపదే క్యాన్సర్ కారణంగా, జయంత్ చదువు  చాలా వరకు ప్రభావితమైంది. కానీ, అతను తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఇప్పుడు అతను ఎంబీయే  చేస్తున్నాడు.

 తొలిసారిగా జయంత్‌కు 2013 లో కేన్సర్ వచ్చింది. అప్పుడు అతను 10 వ తరగతి చదువుతున్నాడు. అతని గొంతు కుడి వైపున హాడ్కిన్ లింఫోమా ఉంది. ఇతనికి చికిత్స భగవాన్ మహావీర్ క్యాన్సర్ ఆసుపత్రిలో జరిగింది. ఈ సమయంలో, జయంత్‌కు 12 సార్లు కీమోథెరపీ జరిగింది. క్యాన్సర్ చికిత్సతో పాటు, జయంత్ బోర్డ్ పరీక్షలు కూడా అతను సిద్చిధం అయిపోయాడు. చికిత్సతో పాటు, జయంత్ కూడా పరీక్ష రాసి తన పాఠశాలలో మొదటి స్థానాన్ని సాధించాడు.

ఆ తర్వాత అంతా బాగానే ఉంది. కానీ, క్యాన్సర్ మరోసారి జయంత్‌పై దాడి చేసింది. ఫిబ్రవరి 2015 లో, జయంత్ గొంతుకి అవతలి వైపు కూడా అదే వ్యాధి సంభవించింది. దీని కోసం జయంత్ రేడియోథెరపీని ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ సమయంలో, జయంత్ 60 రేడియోథెరపీ సెషన్లను తీసుకున్నాడు.

క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుని బయటపడ్డాడు.  చికిత్స సమయంలో కూడా, జయంత్ చదవడం  ఆపలేదు. దీని తర్వాత జయంత్ బీకాం చదువుకోవడానికి ఢిల్లీ వెళ్లాడు. 2017 ఏప్రిల్ , జూలై మధ్య మొదటి సంవత్సరంలో, జయంత్ కడుపు నొప్పి బారిన పడ్డాడు.  నొప్పి తీవ్రతరం అయినప్పుడు, జయంత్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. మళ్లీ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. ఈ సమయంలో జయంత్ ఒక స్టార్టప్ ప్రారంభించాడు. కానీ చికిత్స కోసం, జయంత్ తన చదువు, స్టార్టప్ రెండింటిని మధ్యలో వదిలేయాల్సి వచ్చింది.

2020 లో క్యాన్సర్ ఆరోసారి సంభవించింది. జయంత్ మళ్లీ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స రెండు సంవత్సరాలు కొనసాగింది. ఈ సమయంలో, జయంత్ తన స్నేహితులతో కలిసి సిటీ స్టార్ క్లబ్ అనే సంస్థను ప్రారంభించాడు. దీని ద్వారా వారు కేన్సర్ రోగులకు సహాయం చేస్తారు. 2019 సంవత్సరం ప్రారంభంలో, జయంత్ ప్యాంక్రియాస్‌లో ఒక చిన్న గడ్డ కనిపించింది. డిసెంబర్ 2019 లో ప్రక్కన ఉంది. ఈసారి కూడా జయంత్ ధైర్యం కోల్పోలేదు. మళ్ళీ కేన్సర్ ను ఓడించాడు. దీని తర్వాత, 6 వ సారి నవంబర్ 2020 లో, జయంత్ కేన్సర్ బారిన పడ్డాడు. ఈసారి  అతని ఎముక మజ్జ మార్పిడి జరిగింది.

కేన్సర్ ను  ఓడించే ఈ ప్రయాణంలో జయంత్ తల్లిదండ్రులు అతని అతిపెద్ద మద్దతుగా నిలిచారు.  దేవుడి నుంచి కూడా నేను నీకు విజయాన్ని అందిస్తానని తన తండ్రి చెప్పినట్లు జయంత్ చెప్పాడు. జయంత్ మాట్లాడుతూ – నా స్నేహితులు నాతో ఆడలేదు. కొంతమంది స్నేహితులు సానుభూతి ఇచ్చేవారు. మేము డబ్బులు అడగకూడదని కుటుంబాలు విడిపోయాయి.

కేన్సర్ తర్వాత జయంత్ జీవితం మారిపోయింది. కానీ..ఏరోజూ జయంత్ తన ఆత్మవిశ్వాసాన్ని వదులుకోలేదు.  నేటికీ ప్రజలు క్యాన్సర్‌ను చాలా పెద్ద వ్యాధిగా భావిస్తున్నారు.  ఇది చాలా తప్పు. అని  జయంత్ చెప్పారు. ఎవరినీ నిరాశపరచవద్దు, కొంత సమయం తర్వాత వ్యాధి పోతుంది మనమందరం కలిసి క్యాన్సర్‌తో పోరాడితే,  త్వరలో యుద్ధంలో విజయం సాధిస్తాము. అని జయంత్ అంటున్నాడు. 

జయంత్, తన స్వభావంలో మార్పు గురించి ఇలా చెప్పాడు – ”ఇంతకు ముందు నేను చాలా మొండిగా, ఏకపక్షంగా, కోపంగా ఉండేవాడిని. ఇప్పుడు నేను జీవితాన్ని మరొక కోణం నుండి చూడటం మొదలుపెట్టాను. నేను ప్రజలకు ఎలా సహాయపడగలను అనే దానిపై నేను ఎక్కువ శ్రద్ధ వహిస్తాను.”  జయంత్  తన అనుభవాలతో ఓ పుస్తకం కూడా రాసాడు. ఇది  త్వరలో ప్రచురించనున్నారు. అతను దాని గురించి చాలా సంతోషిస్తున్నాడు. తన సంస్థ తరపున, అతను చాలా మందికి సహాయం చేస్తున్నాడు. 2017 లో, జయంత్ తన 5 మంది స్నేహితులతో కలిసి సంస్థను ప్రారంభించాడు, నేడు 700 మందికి పైగా అతనితో జతకట్టారు.

దీనితో పాటు, అతను 2018 లోనే జ్ఞాన్ కి బాటీన్ అనే యాప్‌ని ప్రారంభించారు. దీనిని ఇప్పుడు 10 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. త్వరలో అతను స్థానిక దుకాణదారుల కోసం ఒక యాప్‌ను కూడా ప్రారంభించబోతున్నాడు. ప్రస్తుతం, జయంత్ ప్రేరణాత్మక వక్త . రెండవ సంవత్సరం ఎంబీయే విద్యార్థి కూడా. జయంత్ తన సొంత ఆసుపత్రిని ప్రారంభించాలనుకుంటున్నాడు, దీనిలో అతను క్యాన్సర్ రోగులకు ఉచిత చికిత్స అందించాలని కోరుకుంటున్నాడు.  కాబట్టి క్యాన్సర్ వచ్చిన తర్వాత, చికిత్స గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Also Read: Hyderabad Traffic: అక్టోబర్‌ 4 నుంచి 7 వరకు ట్రాఫిక్‌ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్‌.. ఈ వార్తపై పోలీసులు ఏమని స్పందించారంటే.

PM Narendra Modi: విమర్శలు వేరు.. ఆరోపణలు వేరు.. పదవులకన్నా ప్రజా సేవే ముఖ్యం: ప్రధాని మోదీ

Follow Us