ఓర్నీ.. గర్ల్ ఫ్రెండ్ కోసం ఎంత పని చేశాడు.. చివరికి
సాధారణంగా ప్రేమలో ఉన్న వారు తమ గర్ల్ ఫ్రెండ్ను మెప్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అమ్మాయిలను సినిమాలకు తీసుకెళ్లడం, వారికి నచ్చిన గిఫ్ట్స్ కొనివ్వడం చేస్తుంటారు. కానీ ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ ముందు తన హీరోయిజాన్ని ప్రదర్శించబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఏకంగా సింహాల బోనులోకి వెళ్లి దురదృష్టవశాత్తు వాటికి ఆహారమైపోయాడు.
అధికారులు చెప్పినదానిని బట్టి చూస్తే.. ఉజ్బెకిస్థాన్ పార్కెంట్లోని ఓ ప్రైవేట్ జూలో ఎఫ్.ఇరిస్కులోవ్ అనే వ్యక్తి జూ కీపర్గా పని చేస్తున్నారు. ఒకరోజు రాత్రి విధుల్లో ఉండగా.. గర్ల్ఫ్రెండ్కు కాల్ చేశాడు. ఆ క్రమంలో ఆమెను మెప్పించడానికి వీడియో తీస్తూ మూడు సింహాలు ఉన్న ఎన్క్లోజర్లోకి ప్రవేశించాడు. పడుకున్న సింహాలు అతడిని ఏమీ చేయలేదు. అంతటితో అతను సైలెంట్గా బయటకు రాకుండా ఓ సింహాన్ని.. సింబా.. నిశ్శబ్దంగా ఉండూ అంటూ దానితో మాటలు కలిపాడు. అంతే మనిషి గొంతు వినగానే పక్కనేఉన్న మిగతా సింహాలు ఒక్క ఉదుటన లేచాయి. అతనిపై ఒక్కసారిగా దాడిచేసాయి. దీంతో ఇరిస్కులోవ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన డిసెంబరు 17న జరిగినట్లు పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇరిస్కులోవ్ను హతమార్చిన అనంతరం మూడు సింహాలు బోనులో నుంచి బయటకు వచ్చి జూ ప్రాంగణంలో తిరిగాయని వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Madhavi Latha: మాట్లాడుతూ బోరున ఏడ్చేసిన మాధవీలత
తెలంగాణలోనూ ‘గేమ్ ఛేంజర్’ టికెట్ రేట్ల పెంపుపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్
డాక్టర్ to యాక్టర్.. ఈ బ్యూటీ జర్నీ మామూలుగా లేదుగా..
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

