AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ 4 పథకాల్లో పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా ఆదాయాన్ని పొందండి..

Senior Citizens Schemes : ఉద్యోగ విరమణ తరువాత ప్రజలు తరచుగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు.

ఈ 4 పథకాల్లో పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా ఆదాయాన్ని పొందండి..
4 Schemes
uppula Raju
| Edited By: Anil kumar poka|

Updated on: Jul 03, 2021 | 10:28 PM

Share

Senior Citizens Schemes  : ఉద్యోగ విరమణ తరువాత ప్రజలు తరచుగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. భవిష్యత్తు అవసరాల కోసం సరైన సమయంలో సరైన పథకంలో పెట్టుబడులు పెట్టడం అవసరం. ఈ రోజుల్లో మార్కెట్లో అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ నాలుగు పథకాలు సీనియర్ సిటిజన్స్ రెగ్యులర్ ఆదాయాన్ని కొనసాగించడానికి సహాయపడుతాయి. కనుక ఒక్కసారి వాటి గురించి తెలుసుకుందాం.

1. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) మీరు ప్రభుత్వ రంగ బ్యాంకులు లేదా భారతీయ తపాలా కార్యాలయాల ద్వారా ఎస్సీఎస్ఎస్ లో పెట్టుబడులు పెట్టవచ్చు. అందులో మీరు 15 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. దీని పరిపక్వత ఐదేళ్లు. దీన్ని మరో మూడేళ్ల వరకు పొడిగించవచ్చు. ఇందులో త్రైమాసిక చెల్లింపు ఎంపికను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం సంవత్సరానికి 7.40% చొప్పున వడ్డీ చెల్లిస్తున్నారు.

2. ప్రధాన్ మంత్రి వయా వందన యోజన (పిఎంవివివై) ఈ పథకం సీనియర్ సిటిజన్ల కోసం. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో అధిక వయోపరిమితి లేదు. ఒక వ్యక్తి ఈ పథకంలో గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. దరఖాస్తుదారులు ఇందులో ఒక పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. పెన్షన్ చెల్లింపు కోసం నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక లేదా వార్షిక ఎంపికను ఎంచుకోవచ్చు. వార్షిక పెన్షన్ కోసం కనీస కొనుగోలు ధర రూ.1,44,578. కాగా గరిష్ట కొనుగోలు రేటు రూ.14,45,783. పిఎంవివివై పథకంలో మధ్యలో డబ్బు ఉపసంహరణ సౌకర్యం కూడా ఉంది.

3. ఆర్బీఐ రేటు బాండ్ ఆర్‌బిఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్లలో 15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. ఈ బాండ్‌లో 1,000 రూపాయల ద్వారా మీరు పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. అదే సమయంలో ఇందులో గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. ప్రస్తుతం సంవత్సరానికి 7.15% వడ్డీ ఇస్తున్నారు.

4. జాతీయ పొదుపు పథకం పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సి) పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా మంచి రాబడిని పొందవచ్చు. దీని కింద పెట్టుబడిదారులకు మంచి రాబడి లభిస్తుంది. దీనితో పాటు ఆదాయపు పన్ను మినహాయింపును కూడా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద పొందవచ్చు. ఎన్‌ఎస్‌సి పథకంలో ఏటా 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది వార్షిక ప్రాతిపదికన లెక్కిస్తారు.

Bandi Sanjay : కృష్ణా జలాలను కాపాడటంలో కేసీఆర్ విఫలం.. కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

LIC Jeevan Lakshya : నెలకు రూ.1842 పే చేయండి 14 లక్షల లాభం పొందండి..! పాలసీదారుడు మరణిస్తే ప్రీమియం కూడా మాఫీ..

Railway Passengers : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఇకనుంచి అతి తక్కువ ధరలో ఏసీ ప్రయాణం