AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Nithi: మూర్ఖులతో వాదించకండి.. అలా చేయడం ద్వారా మన సమయం వృధా.. ఎందుకంటే..

ఆచార్య చాణక్యుడి విధానాలు, ఆలోచనలు మీకు కొంచెం కఠినంగా అనిపించవచ్చు. కానీ ఈ దృఢత్వం జీవిత సత్యం. ఉరుకులు పరుగుల జీవితంలో మనం ఈ ఆలోచనలను విస్మరించవచ్చు.

Chanakya Nithi: మూర్ఖులతో వాదించకండి.. అలా చేయడం ద్వారా మన సమయం వృధా..  ఎందుకంటే..
Acharya Chanakya
Sanjay Kasula
|

Updated on: Dec 01, 2021 | 3:08 PM

Share

ఆచార్య చాణక్యుడి విధానాలు, ఆలోచనలు మీకు కొంచెం కఠినంగా అనిపించవచ్చు. కానీ ఈ దృఢత్వం జీవిత సత్యం. ఉరుకులు పరుగుల జీవితంలో మనం ఈ ఆలోచనలను విస్మరించవచ్చు. కానీ ఆయన చెప్పిన ప్రతి పదం మన జీవితంలోని ప్రతి పరీక్షలో మీకు సహాయపడతాయి. ఈ రోజు మనం ఆచార్య చాణక్యుడి ఆలోచనలలోని మరొక ఆలోచనను విశ్లేషించుకుందాం. నేటి ఆలోచనలో ఆచార్య చాణక్యుడు మూర్ఖుల గురించి ఇలా వివరించారు.

మూర్ఖులతో వాదించకండి ఎందుకంటే..

ఆచార్య చాణక్యుడు తన నీతి గ్రంధంలో మూర్ఖుల గురించి ప్రస్తావించాడు. మూర్ఖులతో ఎప్పుడూ వాదించవద్దని ఆచార్య చెప్పారు. ఇలా చేయడం వల్ల మీరు మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవడమే కాకుండా.. వాదిస్తూ మీ మాటలను కూడా వృధా చేసుకుంటారు. ఎందుకంటే మూర్ఖులు ఏదైనా అర్థం చేసుకోవడం కష్టం. వారు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు.

నిజ జీవితంలో మీరు అనేక రకాల వ్యక్తులతో ముఖాముఖిగా మాట్లాడుతుంటారు. కాబట్టి తెలివితక్కువవారు కొందరు మీకు ఎదురుపడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సూచిస్తారు. ఈ వ్యక్తులకు ఏదైనా వివరించడం కొంచెం కష్టం. ఎందుకంటే ఈ వ్యక్తులు తాము వింటున్నది.. అర్థం చేసుకునేది సరైనదని భావిస్తారు.

మీరు ఈ వ్యక్తులను చాలాసార్లు ఒప్పించేందుకు మీ వంతు ప్రయత్నం చేస్తారు. మీ ప్రయత్నాలు సఫలమవుతాయని మీరు అనుకుంటున్నారు. కానీ అది జరగలేదు. మూర్ఖులు తాము చెప్పేది నిజమేనని అనుకుంటారు. ఎదుటివారి పట్ల తమకు సరైన అనుభూతి ఉండదు. మీరు వారికి వివరించడానికి మీ సమయాన్ని ఎందుకు వెచ్చించడం. కానీ చివరికి ఫలితం శూన్యం. అందుకే ఆచార్య చాణక్యుడు మూర్ఖులతో వాదించకూడదని చెప్పాడు, అలా చేయడం వల్ల మన సమయాన్ని మనం వృధా చేసుకుంటాము.

ఇవి కూడా చదవండి: Sirivennela Seetharama Sastry: ఇక సెలవు.. అశ్రునయనాల మధ్య సిరివెన్నెల అంతిమయాత్ర..

Pulwama Encounter: పుల్వామాలో ఎన్​కౌంటర్.. ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టిన సైన్యం