Telangana: అమ్మ బాబోయ్.. ఎంత ధైర్యం..! కరిచిన పాముతో సహా చికిత్సకోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళ

ఉపాధిహామీ కూలి పనికి వెళ్ళిన మహిళ పాము కాటు గురైంది.. వెంటనే అప్రమత్తమై ఆ పామును అక్కడికక్కడే కొట్టి చంపిన మహిళ పాముతో సహా ఆసుపత్రిలో వైద్యం కోసం వెళ్ళింది. ఈ విచిత్ర సంఘటన ములుగు జిల్లాలో జరిగింది. మహిళ చేతిలో పామును చూసిన వైద్య సిబ్బంది ఒక్కసారిగా బిత్తరపోయారు.

Telangana: అమ్మ బాబోయ్.. ఎంత ధైర్యం..! కరిచిన పాముతో సహా చికిత్సకోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళ
Woman With Snake
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 17, 2024 | 12:15 PM

ఉపాధిహామీ కూలి పనికి వెళ్ళిన మహిళ పాము కాటు గురైంది.. వెంటనే అప్రమత్తమై ఆ పామును అక్కడికక్కడే కొట్టి చంపిన మహిళ పాముతో సహా ఆసుపత్రిలో వైద్యం కోసం వెళ్ళింది. ఈ విచిత్ర సంఘటన ములుగు జిల్లాలో జరిగింది. మహిళ చేతిలో పామును చూసిన వైద్య సిబ్బంది ఒక్కసారిగా బిత్తరపోయారు.

ములుగు జిల్లా వెంకటాపురం మండలం ముకునూరుపాలెం గ్రామానికి చెందిన శాంత అనే మహిళ రోజులాగే ఉపాధి హామీ పనులకు వెళ్లింది. ఈ క్రమంలో ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఒక సాము ఆమెను కాటేసింది. వెంటనే అప్రమత్తమైన మహిళ తనతో ఉన్న సహచర కూలీలతో కలిసి ఆ పామును కొట్టి చంపారు. అక్కడ నుండి వెంటనే వైద్యం కోసం వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రికి బయలుదేరారు. బయలుదేరే సమయంలో ఆమెకు ఓ అనుమానం వచ్చింది. ఆసుపత్రికి వెళ్తే వైద్యులు ఏ పాము కరిచిందని ప్రశ్నిస్తారు. ఆ పాము ఏంటో తెలిస్తేనే సకాలంలో మెరుగైన వైద్యం చేస్తారని అనుమానం వచ్చింది.

పాము కాటు నుండి ప్రాణాలు కాపాడుకోవాలనే తాపత్రయంతో పరుగులు పెట్టిన మహిళ, తనను కరిచిన పామును కూడా వెంట తీసుకొని ఆసుపత్రికి వెళ్ళింది. మహిళ చేతిలో చనిపోయిన పామును చూసిన బిత్తరపోయిన వైద్య సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మహిళను ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుని వెంటనే వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం శాంత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మహిళ ఇలా పాముతో సహా ఆసుపత్రికి చికిత్సకోసం రావడం చూసి ప్రతిఒక్కరూ ఆశ్చర్య పోయారు. వైద్య సిబ్బందితోసహా స్థానికులు ఆ మహిళ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. తనను కరిచిన పాము ఏంటో తెలవడం వల్ల ట్రీట్మెంట్ సులభతరం అయ్యిందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles