World Osteoporosis Day: ఆస్టియోపోరోసిస్‌ను నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం వికలాంగులుగా మారుతారు.. ఈ వ్యాధి నుంచి ఎలా జయించాలంటే..

ఆస్టియోపోరోసిస్‌ ఈ పేరు చెబితో బహుశా అందరికీ తెలియకపోవచ్చు కానీ.. ఎముకలు గుల్ల బారడం అంటే అందిరికీ తెలిసే ఉంటుంది. ఎముకల్లో చేవ తగ్గిపోయి, ధృఢత్వం కోల్పోయి, బోలుగా మారుతాయి. దీనికి ఆస్టియోపోరోసిస్‌గా పిలుస్తారు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం వికలాంగులుగా..

World Osteoporosis Day: ఆస్టియోపోరోసిస్‌ను నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం వికలాంగులుగా మారుతారు.. ఈ వ్యాధి నుంచి ఎలా జయించాలంటే..
World Osteoporosis Day
Follow us

|

Updated on: Oct 21, 2022 | 6:10 AM

ఆస్టియోపోరోసిస్‌ ఈ పేరు చెబితో బహుశా అందరికీ తెలియకపోవచ్చు కానీ.. ఎముకలు గుల్ల బారడం అంటే అందిరికీ తెలిసే ఉంటుంది. ఎముకల్లో చేవ తగ్గిపోయి, ధృఢత్వం కోల్పోయి, బోలుగా మారుతాయి. దీనికి ఆస్టియోపోరోసిస్‌గా పిలుస్తారు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం వికలాంగులుగా మారే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకుగాను ప్రతీ ఏటా అక్టోబర్‌ 20వ తేదీన ప్రపంచ ఆస్టియోపోరోసిస్‌ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రజల్లో ఈ వ్యాధిపై అవగాహన కల్పించడమే ఈ రోజు ముఖ్య లక్ష్యం. ఇంతకీ ఈ వ్యాధి ఎలా వస్తుంది.? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.? దీనిని జయించాలంటే ఏం చేయాలి.? లాంటి పూర్తి వివరాలను ఫరీదాబాద్‌లోని అకార్డ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్‌మెంట్ & స్పోర్ట్స్ నిపుణుడు డాక్టర్‌ యువరాజ్‌ కుమార్‌ తెలిపారు. వారి మాటల్లోనే..

ఈ వ్యాధి ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండా అటాక్‌ చేస్తుంది. 50 ఏళ్లు పైబడిన ప్రతీ ముగ్గురిలో ఒకరు, ప్రతీ 5గురు పురుషుల్లో ఒకరు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో ఎముకలు ధృడత్వాన్ని కోల్పోవడంతో పాటు ఎదగవు. ఇక ఆస్టియోపోరోసిస్‌ వ్యాధి బారిన పడిన వారికి ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించవు. వ్యాధి తీవ్ర పెరిగి ఎదైనా ఎముక విరిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది. వయసుతో పాటు సంక్రమించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎముకల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడంతోనే ఈ వ్యాధికి అడ్డుకట్ట వేయొచ్చు.

ఈ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం, ముందస్తు లక్షణాలు కనిపించకపోవడంతో కేవలం 20 శాతం మంది మాత్రమే ప్రతీ ఏటా ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. మోనోపాజ్‌ దశకు చేరుకున్న మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొన్ని ముందస్తు జాగ్రత్తల ద్వారా ఈ వ్యాధి దరి చేరకుండా చూడొచ్చు. ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏంటంటే..

ఇవి కూడా చదవండి

* క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎముకలు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

* తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కాల్షియం, విటమిన్‌ డి, ప్రోటీన్‌లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

* మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.

* కుటుంబంలో ఇంతకు ముందు ఎవరికైనా ఈ వ్యాధి సోకితే పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ మొదట్లోనే వ్యాధిని గుర్తిస్తే జయించడం చాలా సులువు.

* వైద్యుల సూచన మేరకు జీవన విధానంలో, తీసుకునే ఆహారం విషయంలో పలు మార్పులు చేసుకోవడం వల్ల వ్యాధిని జయించవచ్చు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..