AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eat Fruits: పండ్లు ఏ సమయంలో తింటే మంచిదో తెలుసా.. నిపుణులు ఏమంటున్నారంటే..

Right Time To Eat Fruits: పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో పండ్లను దాని జ్యూస్‌గా తయారు చేయడం వల్ల శరీరానికి మరింత శక్తి లభించి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. 

Eat Fruits: పండ్లు ఏ సమయంలో తింటే మంచిదో తెలుసా.. నిపుణులు ఏమంటున్నారంటే..
Right Time To Eat Fruits
Sanjay Kasula
|

Updated on: Mar 31, 2022 | 2:08 PM

Share

పండ్లు(Fruits) తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో పండ్లను దాని జ్యూస్‌గా తయారు చేయడం వల్ల శరీరానికి మరింత శక్తి లభించి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. పండ్లు తీసుకోవడం వల్ల హీట్ స్ట్రోక్, హై బీపీ, క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలతో పోరాడడంలో సహాయపడుతుంది. పండ్లలో ఉండే పోషకాలు చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు, కానీ వాటిని ఎప్పుడు తినాలో అనే విషయంపై ప్రజల మనస్సులలో గందరగోళం ఉంది. చాలా మంది పండ్లను తినడానికి  మంచి, చెడు ఏంటని ప్రశ్నిస్తుంటారు. ఉదాహరణకు, ఉదయాన్నే ఖాళీ కడుపుతో పండ్లు తినడం మంచిదని కొందరు అంటారు, మరికొందరు ప్రతి భోజనానికి ముందు , ఆ తర్వాత పండ్లు తినాలని నమ్ముతారు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే.. నిజంగా పండ్లు తినడానికి తగిన సమయం ఉందా? ఎవరైనా పండ్లు తినకుండా ఉండాల్సిన సమయం ఏదైనా ఉందా? మీరు పండ్లను తినడానికి సమయం గురించి కూడా గందరగోళంగా ఉన్నట్లయితే.. పండ్ల‌ను తిన‌డం వ‌ర‌కు బాగానే ఉంటుంది, కానీ వాటిని ఏ స‌మ‌యంలో తినాలి ? ఎప్పుడు తింటే వాటి వ‌ల్ల మ‌న‌కు లాభాలు క‌లుగుతాయి ? అనే విష‌యం చాలా మందికి తెలియ‌దు. మ‌రి ఇందుకు వైద్యులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందామా..!

పండ్లను ఎప్పుడు తినాలి: పండ్లను అల్పాహారంగా, భోజనంతో పాటు, భోజనంగా ఇలా రోజులో ఏ సమయంలోనైనా తినవచ్చని నిపుణులు వివరించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతి భోజనం ఒక పండుతో ప్రారంభించాలి. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌ను కొంచెం త‌గ్గించి అందుకు బ‌దులుగా పండ్ల‌ను తిన‌వ‌చ్చు. దీంతో రోజంగా యాక్టివ్‌గా ఉంటారు. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల్లో చాలా వ‌ర‌కు ఉద‌యాన్నే ల‌భిస్తాయి. దీంతో శ‌రీరం ఉత్తేజంగా ఉంటుంది. అల‌స‌ట త‌గ్గుతుంది. శరీరానికి కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. దీని వ‌ల్ల ఉద‌యం ఉండే బ‌ద్దకం కూడా పోతుంది.

బ్రేక్‌ఫాస్ట్‌కు, లంచ్‌కు మ‌ధ్య కూడా పండ్ల‌ను తిన‌వ‌చ్చు. ఆ స‌మ‌యంలో సిట్ర‌స్ పండ్ల‌ను తింటే మంచిది. అంటే నారింజ‌, బ‌త్తాయి, కివీ, పైనాపిల్ వంటి పండ్ల‌ను తీసుకోవాలి. మ‌ధ్యాహ్నం లంచ్ చేసిన త‌రువాత మామిడి పండ్లు, పుచ్చ‌కాయ‌లు, పైనాపిల్ వంటి పండ్ల‌ను తిన‌వ‌చ్చు.

సాయంత్రం స‌మ‌యంలో కొవ్వు ప‌దార్థాలు, జంక్ ఫుడ్స్‌ను తినేకంటే పండ్ల‌ను స్నాక్స్ రూపంలో తీసుకుంటే మంచిది. దీంతో సాయంత్రం పూట కూడా యాక్టివ్‌గా ఉండ‌వ‌చ్చు. ఇక రాత్రి పూట ఎట్టి ప‌రిస్థితిలోనూ పండ్ల‌ను తిన‌రాదు. వాటి వ‌ల్ల శ‌రీరానికి శ‌క్తి బాగా ల‌భిస్తుంది క‌నుక రాత్రి మ‌న‌కు నిద్ర ఉండ‌దు. నిద్ర‌లేమి స‌మ‌స్య వ‌స్తుంది. కాబ‌ట్టి రాత్రి పూట త‌ప్ప పైన తెలిపిన ఏ స‌మ‌యంలో అయినా పండ్ల‌నుత తీసుకోవ‌చ్చు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫ్రూట్ సలాడ్‌లు, స్మూతీలు, ఖర్జూరం సిరప్ డెజర్ట్‌లు, డ్రై ఫ్రూట్ గార్నిష్‌లు, డ్రై ఫ్రూట్ లడ్డూలు, జాక్‌ఫ్రూట్ కడుబు, పైనాపిల్ గొజ్జు మరియు యాపిల్ పైలను ప్రయత్నించవచ్చు. పండ్లు మీకు ఆరోగ్యకరమైన ఆహారం అని నిపుణులు నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి: Gold Coins: పొలంలో బంగారు నిధి.. మరో మహిళతో రవితేజ జంప్.. ఇదో గోల్డ్ కాయిన్ మిస్టరీ..

Srisailam: శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. కన్నడ భక్తుడిపై హోటల్ యజమాని దాడి.. ఘర్షణ..