AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mental Health: కరోనా తర్వాత విద్యార్థుల్లో పెరిగిన మానసిక అనారోగ్య సమస్యలు.. అవే కారణమంటున్న నిపుణులు..

COVID -19 మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాల ఆన్‌లైన్ తరగతుల విరామం తర్వాత దేశంలోని పాఠశాలలు ఈ ఏడాదే తెరుచుకున్నాయి. అయితే.. దీని ప్రభావం ఇంకా పిల్లలను పట్టిపీడిస్తోందని ఉపాధ్యాయులు, మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.

Mental Health: కరోనా తర్వాత విద్యార్థుల్లో పెరిగిన మానసిక అనారోగ్య సమస్యలు.. అవే కారణమంటున్న నిపుణులు..
Students
Shaik Madar Saheb
| Edited By: Basha Shek|

Updated on: Sep 23, 2022 | 6:23 AM

Share

Students Mental Health: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టించింది. కోవిడ్-19 ప్రభావంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. COVID -19 మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాల ఆన్‌లైన్ తరగతుల విరామం తర్వాత దేశంలోని పాఠశాలలు ఈ ఏడాదే తెరుచుకున్నాయి. అయితే.. దీని ప్రభావం ఇంకా పిల్లలను పట్టిపీడిస్తోందని ఉపాధ్యాయులు, మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా తర్వాత పాఠశాలకు వస్తున్న పిల్లలు మానసికంగా దృఢంగా లేరంటున్నారు. నిరాశ, ఆందోళన, భావోద్వేగం వంటి మానసిక సమస్యలతో పాఠశాలకు తిరిగి వస్తున్న పిల్లలు ఎదుర్కొంటున్నారని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మహమ్మారి కారణంగా ప్రియమైన వారిని కోల్పోయిన విద్యార్థులలో ఇది ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

COVID -19 మహమ్మారి పిల్లలు, కౌమారదశలో ఉన్న ప్రతి ఒక్కరికీ మానసిక ఆరోగ్య పరిణామాలను, పలు సవాళ్లను తీసుకువచ్చింది. దుఃఖం, భయం, అనిశ్చితి, సామాజిక ఒంటరితనం, పెరిగిన స్క్రీన్ సమయం పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. స్నేహాలు, కుటుంబ మద్దతు పిల్లలకు బలమైన శక్తులు. కానీ COVID-19 దీనికి అంతరాయం కలిగించిందని UNICEF తెలిపింది.

“పాఠశాలలు పిల్లలను ఇతరుల పట్ల సానుభూతి చూపేలా, ఒత్తిడి, ఆందోళన సమయాల్లో ఒకరికొకరు మద్దతుగా ఉండేలా అవగాహన కల్పించాలి. పాఠశాలకు వెళ్లే పిల్లలలో మానసిక కల్లోలం, ఆందోళన సమస్యను అరికట్టడానికి ఎలాంటి యంత్రాంగం లేదు. కానీ ప్రతి బిడ్డకు ఇది బోధించడం, మరొకరి పట్ల సానుభూతితో మెలగడం వంటివి పరిస్థితిని నియంత్రించడంలో సహాయపడుతుంది” అని పుదుచ్చేరికి చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ పుల్కిత్ శర్మ అన్నారు.

ఇవి కూడా చదవండి

యువతలో టెన్షన్

యువతలో టెన్షన్ పెరిగిందని.. ఈ ఆందోళనకు చికిత్స చేయకపోతే తీవ్రమైన మానసిక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు నొక్కి చెబుతున్నారు. “మునుపటి అధ్యయనాలు యువతలో డిప్రెషన్, ఇతర మానసిక సమస్యల కేసులు చాలా రెట్లు పెరిగాయని సూచించాయి – ఏకాగ్రత లేకపోవడం పిల్లల జీవితంలో తరువాతి దశలో తలెత్తే సమస్యలకు సంకేతం,” అంటూ పేర్కొన్నారు.

వారి స్వంత జీవితంలో అనిశ్చితి, ఒత్తిడి కారణంగా వారి పిల్లల ఆందోళనలను శాంతింపజేయడం తల్లిదండ్రులకు కష్టంగా మారింది. తల్లిదండ్రులు ఎదుర్కొనే వృత్తిపరమైన లేదా భావోద్వేగ సవాళ్లు వారి పిల్లల అవసరాలు, ఆందోళనలను పరిష్కరించే వారి సాధారణ సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తాయి.

దేశంలోని పాఠశాలల్లో సామాజిక-భావోద్వేగ అభ్యాసన కార్యక్రమాలు, కౌన్సెలింగ్ సెషన్‌లను ప్రవేశపెట్టడం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితిపై సున్నితంగా ఉండాల్సిన అవసరం ఉందని, బాధిత పిల్లలను తిరిగి సాధారణ జీవితంలోకి, బయటి ప్రపంచంలోకి తీసుకురావడానికి కనీసం ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని నిపుణులు పేర్కొన్నారు.

NCERT మార్గర్శకాలు..

ఇటీవల, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) పాఠశాల పిల్లలలో మానసిక ఆరోగ్య సర్వేను అనుసరించి పాఠశాలకు వెళ్లే పిల్లలు, కౌమారదశలో మానసిక ఆరోగ్య సమస్యలకు ముందస్తు గుర్తింపు, జోక్యం కోసం కొన్ని మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది .

“పాఠశాలలు సాధారణంగా అభ్యాసకులు ఆరోగ్యకరమైన, సురక్షితమైన వాతావరణంలో అభివృద్ధి చెందాలని ఆశించే ప్రదేశాలుగా ఉంటాయి. పాఠశాల నిర్వహణ, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది, విద్యార్థులు అందరూ రోజులో మూడింట ఒక వంతు సమయాన్ని గడుపుతారు. పాఠశాలలు సంవత్సరానికి దాదాపు 220 రోజులు పనిచేస్తాయి. రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థి ఉండే సమయం మరింత ఎక్కువగా ఉంటుంది. కావున, పాఠశాలలు, హాస్టళ్లలోని పిల్లలందరికీ.. భద్రత, అభ్యసనం, ఆరోగ్యం, ఆహారం, శ్రేయస్సును నిర్ధారించడం ఆయా పాఠశాలల బాధ్యత. అని NCERT మార్గదర్శకాలను జారీ చేసింది.

Source Link

తాజా హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు