AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: భారత్‌లో స్ట్రోక్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది.. ముందస్తు జాగ్రత్తలతో మరణాలకు చెక్‌..

మారుతోన్న జీవన విధానం, తీసుకుంటోన్న ఆహారం కారణంగా స్ట్రోక్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇండియన్‌ స్ట్రోక్‌ అఫిలియేషన్‌ ప్రకారం భారత్‌లో స్ట్రోక్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం భారత్‌లో సుమారు..

Health: భారత్‌లో స్ట్రోక్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది.. ముందస్తు జాగ్రత్తలతో మరణాలకు చెక్‌..
Stroke
Narender Vaitla
|

Updated on: Oct 28, 2022 | 9:45 PM

Share

మారుతోన్న జీవన విధానం, తీసుకుంటోన్న ఆహారం కారణంగా స్ట్రోక్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇండియన్‌ స్ట్రోక్‌ అఫిలియేషన్‌ ప్రకారం భారత్‌లో స్ట్రోక్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం భారత్‌లో సుమారు 1.8 మిలియన్ల మంది వ్యక్తులు స్ట్రోక్‌ తాలుకు దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్నారు. అయితే వీరిలో చాలా మంది ముందస్తు చికిత్స తీసుకోవడం వల్ల మరణాలు తగ్గుతున్నాయి. మెదడుకు ఆక్సిజన్‌, రక్తం సరఫరాలో ఆటంకాలు ఏర్పడడం వల్ల స్ట్రోక్‌లు సంభవిస్తున్నాయి.

ఈ స్ట్రోక్‌కు ఒత్తిడి కూడా కారణంగా నిపుణులు చెబుతున్నారు. కుటుంబ సమస్యలు, పని ఒత్తిడిలాంటివి ఒత్తిడిని కలిగిస్తాయి. ఇక కరోనా కారణంగా కూడా చాలా మందిలో ఒత్తిడి పెరిగింది. ఇలా నిరంతరంగా కొనసాగితే ఒత్తిడి కారణంగా చాలా మంది స్ట్రోక్‌ బారిన పడుతున్నారు. మెజారిటీ స్ట్రోక్‌లు మెదడులోని ఇన్‌ఫ్రాక్ట్‌ల వల్ల సంభవిస్తాయి. 10 శాతం కంటే ఎక్కువ మందిలో రక్తస్రావం వల్ల స్ట్రోక్‌లు సంభవిస్తున్నాయి. స్ట్రోక్‌కు కారణమయ్యే ప్రధాన కారణాల్లో ధూమపానం, మద్యపానం ప్రధానంగా చెప్పొచ్చు.

అలాగే మధుమేహం, రక్తపోటు, డైస్లిపిడెమియో, గుండె జబ్బులు, గర్భ నిరోధక మాత్రలు తీసుకోవడం వల్ల స్ట్రోక్‌లు సంభవిస్తున్నాయి. స్ట్రోక్‌ సమస్యను కొన్ని ప్రాథమిక లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. కంటిలో మార్పులు, ముఖం ఒకవైపు వంగడం, ఒక చేయి బలహీనంగా మారడం వంటివి లక్షణాల ద్వారా స్ట్రోక్‌ను ముందస్తుగానే గుర్తించవచ్చు. అలాగే ముఖం, చేతులు, కాళ్లు తిమ్మిర్లు రావడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం, మైకం రావడం, ఎలాంటి కారణం లేకుండా తీవ్రమైన తలనొప్పి రావడం వంటివి స్ట్రోక్‌ లక్షణాలుగా చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి

స్ట్రోక్‌కి ఇలా చెక్‌ పెట్టొచ్చు..

మెదడుకు ఆక్సిజన్‌ సరిగ్గా అందకపోవడం వల్లే స్ట్రోక్‌ వస్తుందనే విషయం తెలిసిందే. అందుకే మెడిటేషన్‌, యోగా వంటి శ్వాస సంబంధిత వ్యాయామాలను అలవాటు చేసుకోవాలి. దీంతో మెదడుకు కావాల్సిన ఆక్సిజన్‌ సక్రమంగా అందుతుంది. మానసిక ఆనందాన్ని పెంపొందించేందుకు మార్గాలను వెతుక్కోవాలి. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మంచి సంగీతం వినడం, వ్యాపకాలను అలవాటు చేసుకోవాలి. ఇక స్ట్రోక్‌ తాలుకూ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల సూచనలు తీసుకోవడం ద్వారా వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే నివారించవచ్చు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
దుష్టులతో వాదనలు వద్దు... దూరంగా ఉండటమే తెలివి!
దుష్టులతో వాదనలు వద్దు... దూరంగా ఉండటమే తెలివి!
వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే!
వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే!
ప్రజా సమస్యలపై ఎవరొచ్చినా కలిసి పోరాడుతాంః జగన్
ప్రజా సమస్యలపై ఎవరొచ్చినా కలిసి పోరాడుతాంః జగన్
గ్యాస్‌తో పనే లేదు.. ఛార్జింగ్ స్టౌలు వచ్చేసాయి..
గ్యాస్‌తో పనే లేదు.. ఛార్జింగ్ స్టౌలు వచ్చేసాయి..
40 డిగ్రీలకే కరుగుతున్న రోడ్లు.. భారత్‌లో 45 డిగ్రీలు దాటినా ఎలా?
40 డిగ్రీలకే కరుగుతున్న రోడ్లు.. భారత్‌లో 45 డిగ్రీలు దాటినా ఎలా?