AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mental Health Professionals: ఆ రాష్ట్రంలో పెరుగుతున్న మానసిక రోగుల సంఖ్య.. సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైన కీలక విషయాలు

Mental Health Professionals: సంవత్సరానికి పదివేల మానసిక ఆరోగ్య నిపుణులు అవసరమని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సమాచారం హక్కు చట్టం..

Mental Health Professionals: ఆ రాష్ట్రంలో పెరుగుతున్న మానసిక రోగుల సంఖ్య.. సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైన కీలక విషయాలు
Subhash Goud
|

Updated on: May 24, 2022 | 1:26 PM

Share

Mental Health Professionals: సంవత్సరానికి పదివేల మానసిక ఆరోగ్య నిపుణులు అవసరమని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సమాచారం హక్కు చట్టం  (RTI)ప్రకారం.. మహారాష్ట్రలో మే 14వ తేదీ నాటికి నాలుగు ప్రాంతీయమ మానసిక వైద్యశాలలు మాత్రమే పని చేస్తున్నాయి. మానసిక రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. దాదాపు 1.3 బిలియన్ల జనాభాతో 13 కోట్ల మంది ప్రజలు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అంచనా. వీరికి భారతదేశంలో నిరంతరం నిపుణుల సలహాలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ మానసిక ఆరోగ్య విభాగం నుంచి సమాచార హక్కు చట్టం (RTI) కింద వెల్లడైన సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో మే 14 నాటికి కేవలం ప్రాంతీయ మానసిక ఆస్పత్రులు మాత్రమే పని చేస్తున్నట్లు తెలుస్తోందిన. ఇలాంటి భయానక పరిస్థితులను ఇటీవల వార్తా నివేదికలు వెల్లడించాయి.

నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే 2015-16 ప్రకారం.. తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మానసిక రుగ్మతలు ఎక్కువగా ఉన్నట్లు గమనించబడింది. వివిధ రుగ్మతలకు మానసిక రుగ్మతలకు చికిత్స గ్యాప్ 70-92 శాతం మధ్య ఉంటుందని దాని సర్వే ద్వారా తేలింది. సాధారణ మానసిక రుగ్మత – 85 శాతం, తీవ్రమైన మానసిక రుగ్మత – 73.6 శాతం, సైకోసిస్ – 75.5 శాతం, బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్ – 70.4 శాతం. ఢిల్లీలోని సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ సంజయ్ చుగ్ మీడియాతో మాట్లాడుతూ మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు విపరీతంగా పెరగాలని అన్నారు. ప్రస్తుతం ఉన్నదానికంటే 100 రెట్లు పెంచాలి. సమస్య ప్రారంభమైనప్పుడు వెంటనే చికిత్స చేయవలసిన అవసరం ఉందని, అట్టడుగు స్థాయి జనాభాకు కూడా మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డాక్టర్ చుగ్ అన్నారు.

ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందన్నారు. అన్ని రకాల మానసిక ఆరోగ్య రుగ్మతలు ఉన్నవారు, అల్జీమర్స్ తీవ్రమైన కేసు లేదా స్ట్రోక్‌తో బాధపడుతున్న నాడీ సంబంధిత రోగులు మానసిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శిస్తే అలాంటి వారికి సహాయం చేయడానికి చాలా తక్కువ మంది వైద్యులు, సహాయక సిబ్బంది ఉన్నారు. భారతదేశంలో, మానసిక ఆరోగ్యానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఉందని ఆయన అన్నారు. “ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం మంది మానసిక సమస్యలను ఎదుర్కొంటారని అంచనా వేయబడింది. జనాభా పరిమాణం దాదాపు 1.3 బిలియన్లు ఉన్న మనలాంటి దేశంలో, 13 కోట్ల మందికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నారు. ఏదైనా సంస్కరణలు తీసుకురావడానికి మానసిక సమస్యలే అత్యంత ప్రబలంగా ఉన్న రుగ్మతలు, ఒక వ్యక్తి కలిగి ఉన్న ఇతర ఆరోగ్య సమస్యల కంటే ముందున్నాయని గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ వృత్తిలోకి సైకియాట్రిస్ట్‌లు, సైకాలజిస్ట్‌లు, థెరపిస్ట్‌లు చాలా ఎక్కువ సంఖ్యలో రావాలన్నారు. వార్షిక ప్రాతిపదికన మేము అలాంటి నిపుణులను 10,000 మందిని చేర్చుకోవాలి అని డాక్టర్ చుగ్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి