AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rising Obesity: మారిన అలవాట్లు, జీవన శైలితో పొంచి ఉన్న ముప్పు.. రానున్న 25 ఏళ్లలో 44 కోట్ల మంది ఈ వ్యాధిన పడే ఛాన్స్

చెడు జీవనశైలి కారణంగా.. దేశంలో ఒక వ్యాధి చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీనిని ఇప్పుడు ఆపకపోతే రానున్న రెండు దశాబ్దాలలో దేశ పౌరులలో మూడింట ఒక వంతు మంది ఈ వ్యాధికి బలైపోవచ్చు. ఇది కేవలం ఒక వ్యాధి మాత్రమే కాదు.. అనేక వ్యాధులకు తల్లి కూడా. నిపుణులు ఈ వ్యాధిని సునామీ లాంటిదని అభివర్ణించారు. ఈ వ్యాధిని ఇప్పుడే నియంత్రించకపోతే.. భవిష్యత్తులో దేశ ఆరోగ్య నిర్మాణం, ఆర్థిక ఉత్పాదకత తీవ్రంగా ప్రభావితమవుతాయని హెచ్చరిస్తున్నారు.

Rising Obesity: మారిన అలవాట్లు, జీవన శైలితో పొంచి ఉన్న ముప్పు.. రానున్న 25 ఏళ్లలో 44 కోట్ల మంది ఈ వ్యాధిన పడే ఛాన్స్
Rising Obesity Rates
Surya Kala
|

Updated on: May 19, 2025 | 7:13 PM

Share

భారతదేశంలో ఒక వ్యాధి చాలా వేగంగా వ్యాపిస్తోంది. మారిన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా.. పిల్లలు కూడా దీనికి బలైపోతున్నారు. ఈ వ్యాధి కారణంగా అనేక ఇతర తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ వ్యాధి సునామీగా మారి రాబోయే 25 సంవత్సరాలలో భారతదేశాన్ని తాకవచ్చు. భారతదేశంలో నివసిస్తున్న 35 శాతం కంటే ఎక్కువ మంది ఈ వ్యాధికి బలైపోయే అవకాశం ఉంది. ఈ వ్యాధి ఏమిటి? ఇది ఎందుకు అంత వేగంగా వ్యాపిస్తోంది? ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నిపుణుల సలహా ఏమిటో తెలుసుకుందాం..

ఈ వ్యాధి అనేక ఇతర వ్యాధులకు మూలకారణంగా చెప్పబడింది. ఈ వ్యాధి టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, కొవ్వు కాలేయం, హార్మోన్ల రుగ్మతలు, పిల్లలను కనలేకపోవడం, కొన్ని క్యాన్సర్లు వంటి వ్యాధుల పెరుగుదలకు నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. ఈ వ్యాధి దేశంలో ఒక సంక్షోభంగా మారుతోంది. ఈ వ్యాధికి ప్రధాన కారణం చెడు జీవనశైలి, మారిన దినచర్య, ఆహారపు అలవాట్లు. ఈ వ్యాధి పిల్లలను కూడా ప్రభావితం చేస్తుంది.

ఈ వ్యాధి ఏమిటి?

ఈ వ్యాధిని స్థూలకాయం అంటారు. ది లాన్సెట్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. 2050 నాటికి భారతదేశ జనాభాలో దాదాపు మూడింట ఒక వంతు మంది లేదా 449 మిలియన్ల మంది ఊబకాయంతో బాధపడే అవకాశం ఉంది. AIIMS లోని మెడిసిన్ విభాగంలో అదనపు ప్రొఫెసర్ డాక్టర్ నీరజ్ నిశ్చల్ ప్రకారం 20 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల వారిలో అంటువ్యాధులు కాని వ్యాధుల పెరుగుదల ఆందోళనకరంగా ఉంది. దీనికి ప్రధాన కారణం స్థూలకాయం. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు.. డీన్ డాక్టర్ రాజేష్ ఉపాధ్యాయ్ ప్రకారం ఊబకాయ సమస్యని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇది దేశ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, ఆర్థిక ఉత్పాదకతపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

ఇవి కూడా చదవండి

దీనిని ఎలా నియంత్రించాలంటే

అంటువ్యాధిలా పెరుగుతున్న ఈ ఊబకాయం వ్యాధిని ఆపడానికి… పెద్ద ఎత్తున ప్రణాలికలను రచించాలి.. ఊబకాయం గురించి ప్రజలను అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ వ్యాధి జీవనశైలికి నేరుగా సంబంధించినది. చిన్న వయసులోనే పిల్లలు దీని బాధితులుగా మారుతున్నారు. దీనిని నివారించడానికి, పాఠశాలల నుండే అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు జరగాలి. పిల్లలకు ఏది మంచిదో, ఏది చెడ్డదో వారి ఆరోగ్యానికి చెప్పాలి. ఇది మాత్రమే కాదు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటి నుండే దీని కోసం ప్రయత్నాలు చేయకపోతే, రెండు దశాబ్దాల తర్వాత దేశ ఆరోగ్యం పూర్తిగా క్షీణించవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..