Heart Attack: ప్రతి సంవత్సరం 28 వేల మంది గుండెపోటుతో మరణం.. భయపెడుతున్న గణాంకాలు

ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఉన్నట్టుండి గుండెపోటు వచ్చి ఆస్పత్రికి చేరుకునేలోపే ప్రాణాలు విడుస్తున్నారు. మారుతున్న జీవనశైలి కారణంగా ఇలా..

Heart Attack: ప్రతి సంవత్సరం 28 వేల మంది గుండెపోటుతో మరణం.. భయపెడుతున్న గణాంకాలు
Heart Attack
Follow us

|

Updated on: Oct 08, 2022 | 2:21 PM

ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఉన్నట్టుండి గుండెపోటు వచ్చి ఆస్పత్రికి చేరుకునేలోపే ప్రాణాలు విడుస్తున్నారు. మారుతున్న జీవనశైలి కారణంగా ఇలా గుండెపోటు బారిన పడుతున్నారని, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ సమయానికి భోజనం చేస్తూ, వ్యాయమాలు చేయడం లేక గుండెపోటు బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే గత కొన్ని వారాలుగా గుండెపోటుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఎక్కడో రాంలీలా ప్రదర్శన సమయంలో కళాకారుడికి గుండెపోటు వచ్చింది. ఎక్కడో ఒక వ్యక్తి నృత్యం చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఇంతమంది ఇలా సడన్‌గా గుండెపోటు ఎందుకు వచ్చిందో తెలియకపోవచ్చు. గణాంకాలను పరిశీలిస్తే గత దశాబ్దంలోనే భారతదేశంలో 2.40 లక్షల మందికి పైగా మరణించారు.

2014, 2017 మధ్య కాలంలో 82,289 మంది గుండెపోటుతో మరణించారు. అంటే ఏటా సగటున 20 వేల మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. 2018 నుంచి 2021 మధ్య కాలంలో 1,10,898 మంది గుండెపోటుతో మరణించారు. 2019, 2020, 2021లో గుండెపోటు కారణంగా 28 వేల మందికి పైగా మరణించారు. మనం 2021 గణాంకాలను పరిశీలిస్తే, గుండెపోటు కారణంగా మరణించిన వారిలో ఎక్కువ మంది 45 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఉన్నారు. ఈ వయస్సులో 11,190 మంది గుండెపోటుతో మరణించారు. గుండెపోటుకు సంబంధించిన ఈ గణాంకాలు కూడా చాలా మంది పురుషులు గుండెపోటుకు గురవుతున్నారనేది ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2021లో 24,510 మంది పురుషులు గుండెపోటుతో మరణించగా, 3,936 మంది మహిళలు మరణించారు. అయితే బాధ్యతల భారం లేదా ఇతర కారణాల వల్ల, ఎవరైనా ఒత్తిడి సమస్యను ఎదుర్కొంటారు. ఒత్తిడి పెరిగితే అది డిప్రెషన్ వంటి తీవ్రమైన సమస్యలను సృష్టిస్తుంది. చాలా సందర్భాలలో, యువతలో ఒత్తిడి కారణంగా గుండెపోటు వస్తుంది.

ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో చాలా మంది యువత తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. చాలా సార్లు ప్రజలు బయటి నుంచి జంక్ ఫుడ్‌, ఆయిల్ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ రకమైన ఆహారం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో అధిక బీపీ, ఇతర సమస్యలు తలెత్తుతాయి. దీని కారణంగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎంత బిజీగా ఉన్న చురుకుగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇంట్లోనే ఉండి వ్యాయమం, యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. యోగా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మానసికంగా కూడా ప్రశాంతతను అందిస్తుంది. పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువగా తినండి. ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తినండి, ఎక్కువ నీరు తాగండి.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం