AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోగ్యానికి మంచిదని లీటర్లకు లీటర్లు నీళ్లు తాగేస్తున్నారా..అయితే ప్రమాదంలో పడ్డట్టే..ఎలాగంటే…

ఆరోగ్యానికి మేలు చేసే నీళ్లే అయినా సరే, ఎక్కువైతే జీవితంలో విషంలా మారుతుంది. తాగునీరు శరీరంలోని నీటి సమతుల్యతను కాపాడుతుంది మలినాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

ఆరోగ్యానికి మంచిదని లీటర్లకు లీటర్లు నీళ్లు తాగేస్తున్నారా..అయితే ప్రమాదంలో పడ్డట్టే..ఎలాగంటే...
Drinking Water
Madhavi
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 05, 2023 | 8:30 AM

Share

ఆరోగ్యానికి మేలు చేసే నీళ్లే అయినా సరే, ఎక్కువైతే జీవితంలో విషంలా మారుతుంది. తాగునీరు శరీరంలోని నీటి సమతుల్యతను కాపాడుతుంది మలినాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అయితే, ఇతర పదార్థాల మాదిరిగానే, నీటిని అధికంగా తీసుకోవడం కూడా శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. గురుగ్రామ్‌లోని నారాయణ హాస్పిటల్‌లోని డైటీషియన్ పర్మీత్ కౌర్ పలు అంశాలను షేర్ చేసుకున్నారు. ఆమె ఈ సందర్భంగా నీరు తాగడం పై పలు అంశాలను తెలియజేశారు, అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగడం వల్ల రక్తం పరిమాణం పెరుగుతుందని ఎక్కువ నీటిని ఫిల్టర్ చేయడానికి మూత్రపిండాలపై ఒత్తిడి కూడా పెరుగుతుందని చెప్పారు. ఇది గుండెపై మరింత భారం వేసి కడుపులో మంటను పెంచుతుందని తెలిపారు.

ఎక్కువ నీరు త్రాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుంది రక్తంలో సోడియం స్థాయిని తగ్గిస్తుంది, హైపోనాట్రేమియా అనే పరిస్థితికి కారణమవుతుంది. హైపోనాట్రేమియా ద్వారా శరీరంలో వికారం, తలనొప్పి, బలహీనత, చిరాకు, కండరాల తిమ్మిరి మొదలైనవి వచ్చే ప్రమాదం ఉంది.

ఒక రోజులో ఎంత నీరు త్రాగాలి:

-ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ తాగునీటి కోసం మార్గదర్శకాలను ఏర్పాటు చేసింది. ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతిరోజూ 9 నుండి 13 గ్లాసుల నీరు త్రాగాలి.

ఇవి కూడా చదవండి

ఎక్కువ నీరు త్రాగడం వల్ల కలిగే 4 దుష్ప్రభావాలు:

1. హైపోనాట్రేమియా:

ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో సోడియం స్థాయి తగ్గుతుంది. ఈ పరిస్థితినే హైపోనాట్రేమియా అంటారు. గుండె కిడ్నీ సమస్యలు ఉన్నవారికి హైపోనట్రేమియా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

2. కండరాల తిమ్మిరి:

BMJలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, ఎక్కువ నీరు త్రాగటం వల్ల రక్తంలో సోడియం ఇతర ఎలక్ట్రోలైట్‌లు పలచబడతాయి, దీని కారణంగా శరీరంలో సోడియం స్థాయి తగ్గుతుంది. శరీరంలో సోడియం స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల కండరాల తిమ్మిరి వంటి శారీరక సమస్యలు తలెత్తుతాయి.

3. తరచుగా మూత్రవిసర్జన:

ఎక్కువ నీరు తాగడం వల్ల ఎక్కువ మూత్రం వస్తుంది. ఎందుకంటే ఎక్కువ నీరు తాగినప్పుడు కిడ్నీ నిరంతరం పని చేయాల్సి ఉంటుంది. అలాగే, తరచుగా మూత్రవిసర్జన చేయడం వల్ల కిడ్నీలు మరింత ఒత్తిడికి గురవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

4. అతిసారం:

ఓవర్‌హైడ్రేషన్ హైపోకలేమియాకు దారితీస్తుంది లేదా శరీరంలో పొటాషియం స్థాయి తగ్గుతుంది. దీని వల్ల చాలా సేపు విరేచనాలు, చెమటలు పట్టాయి. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ వెబ్‌సైట్‌లోని ఒక నివేదిక ప్రకారం, హైపోకలేమియా తరచుగా నేరుగా జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తడానికి ఇదే కారణమవుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..