AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్‏లోకి మరో క్రేజీ మల్టీస్టారర్.. ఆ ఇద్దరు స్టార్ హీరోల కోసం స్టోరీ సెట్ చేసిన డైరెక్టర్ ?

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే మల్టీస్టారర్ సినిమాల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే వెంకటేశ్, మహేష్.. వెంకటేశ్, పవన్ కళ్యాణ్, వెంకటేశ్, వరుణ్

టాలీవుడ్‏లోకి మరో క్రేజీ మల్టీస్టారర్.. ఆ ఇద్దరు స్టార్ హీరోల కోసం స్టోరీ సెట్ చేసిన డైరెక్టర్ ?
Rajitha Chanti
|

Updated on: Jan 26, 2021 | 1:01 PM

Share

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే మల్టీస్టారర్ సినిమాల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే వెంకటేశ్, మహేష్.. వెంకటేశ్, పవన్ కళ్యాణ్, వెంకటేశ్, వరుణ్ కాంబోలో మల్టీస్టారర్ సినిమాలు విడుదలకాగా.. తాజాగా జక్కన్న దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ భారీ మల్టీస్టారర్ సినిమా రాబోతుంది. ఈ క్రమంలోనే మరో క్రేజీ మల్టీస్టారర్ సినిమా రాబోతున్నట్లుగా టాలీవుడ్‏లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి యాత్రం ఫేం మహేష్ వి.రాఘవ్ ఓ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ నిర్మించేందుకు మహేష్ వి. రాఘవ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే వీరిద్దరికి కోసం స్క్రిప్ట్‏ను కూడా రెడీ చేసాడట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్లో ‘పుష్ప’ మూవీ చేస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుండగా.. ఇందులో రష్మిక మందన హీరోయిన్‏గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం మారెడుపల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే విజయ్ దేవరకొండ కూడా మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే సినిమాను చేస్తున్నాడు. ఇటివలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‏కు విశేషస్పందన లభించింది. ఇక తొందర్లోనే ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత విజయ్, బన్నీ కాంబోలో మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Also Read:

Balakrishna Movie Update: బాలయ్య కోసం రంగంలోకి ఇద్దరు విలన్లు.. బోయపాటి ప్లాన్ మాములుగా లేదుగా..

Follow Us
ఏంటి.. ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అల్లు అర్జున్‌కు బంధువా?
ఏంటి.. ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అల్లు అర్జున్‌కు బంధువా?
సైకో లవ్..తనకు దక్కనిది.. ఇంకెవరికి దక్కొద్దని పెళ్లి మండపంలోనే..
సైకో లవ్..తనకు దక్కనిది.. ఇంకెవరికి దక్కొద్దని పెళ్లి మండపంలోనే..
'అన్ని సమస్యలకు అతనొక్కడే పరిష్కారమా గంభీర్'
'అన్ని సమస్యలకు అతనొక్కడే పరిష్కారమా గంభీర్'
1 గ్రాము రూ.8 లక్షలు..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, ప్రమాదకరమైన విషం
1 గ్రాము రూ.8 లక్షలు..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, ప్రమాదకరమైన విషం
శివుడు ఎవరికంటే ముందు పుట్టాడు..? స్మశానంలో ఎందుకు ఉంటాడు..?
శివుడు ఎవరికంటే ముందు పుట్టాడు..? స్మశానంలో ఎందుకు ఉంటాడు..?
అయ్యో భవానీ.. ఆమెకు సాయం చేయడానికి వెళ్లడమే శాపమైంది..
అయ్యో భవానీ.. ఆమెకు సాయం చేయడానికి వెళ్లడమే శాపమైంది..
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త
ఖరీదైన మందులతో కాదు.. డయాబెటిస్‌కు ఇదే ఏకైక బ్రహ్మాస్త్రం..!
ఖరీదైన మందులతో కాదు.. డయాబెటిస్‌కు ఇదే ఏకైక బ్రహ్మాస్త్రం..!
గుండెల్ని పిండే విషాదం.. ఒకరి తర్వాత ఒకరు.. బాసర విద్యార్థిని..
గుండెల్ని పిండే విషాదం.. ఒకరి తర్వాత ఒకరు.. బాసర విద్యార్థిని..
తిరుమల భక్తులకు అలర్ట్.. ఆన్‌లైన్‌లో వస్త్రాలు ఈ-వేలం, ఈ తేదీల్లో
తిరుమల భక్తులకు అలర్ట్.. ఆన్‌లైన్‌లో వస్త్రాలు ఈ-వేలం, ఈ తేదీల్లో