AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varisu : విడుదలకు ముందే సెన్సెషన్ క్రియేట్ చేస్తోన్న వారసుడు.. ఆడియో హక్కులు సొంతం చేసుకున్న దిగ్గజ సంస్థ..

విజయ్ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన వర్కింగ్ స్టిల్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో ఖుష్బూ, వెటరన్ హీరోయిన్ జయసుధ కీలకపాత్రలలో నటిస్తున్నారు.

Varisu : విడుదలకు ముందే సెన్సెషన్ క్రియేట్ చేస్తోన్న వారసుడు.. ఆడియో హక్కులు సొంతం చేసుకున్న దిగ్గజ సంస్థ..
Varisu Movie
Rajitha Chanti
|

Updated on: Oct 29, 2022 | 2:01 PM

Share

తమిళ్ స్టార్ విజయ్ దళపతికి తమిళంలోనే కాదు.. తెలుగులోనూ యమ క్రేజ్. ఇప్పటివరకు తెలుగులోకి డబ్ చేసి విడుదల చేసిన విజయ్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ హీరో నేరుగా తెలుగులో సినిమా చేస్తున్నారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వరిసు సినిమా చేస్తున్నారు. ఈ మూవీని తెలుగులో వారుసుడు పేరుతో రిలీజ్ చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. విజయ్ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన వర్కింగ్ స్టిల్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో ఖుష్బూ, వెటరన్ హీరోయిన్ జయసుధ కీలకపాత్రలలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు మేకర్స్. ఈక్రమంలోనే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమా ఆడియో హక్కులను పాన్ ఇండియా మార్కెట్లో దిగ్గజ సంస్థ అయిన టీ సిరీస్ సొంతం చేసుకుంది. ఇదే విషయాన్ని టీ సిరీస్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈమూవీ తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలు్సతోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.