Mahesh Babu: ఆ వార్తలలో నిజం లేదు.. ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ లేటేస్ట్ అప్డేట్ ఇదే..

ఎస్ఎస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ..

Mahesh Babu: ఆ వార్తలలో నిజం లేదు.. ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ లేటేస్ట్ అప్డేట్ ఇదే..
Mahesh Babu
Follow us

|

Updated on: Oct 29, 2022 | 7:43 AM

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. అయితే ప్రస్తుతం మహేష్ షూటింగ్స్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఉన్నారు. నవంబర్‏లో మహేష్ భారత్ రానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ మూవీ తిరిగి షూటింగ్ స్టార్ట్ కానుందట. అయితే కొద్ది రోజులుగా ఈ మూవీ గురించి కొన్ని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని.. మహేష్ స్ర్కిప్టులో కొన్ని మార్పులు కోరారని… దీంతో చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చారని.. ప్రస్తుతం త్రివిక్రమ్ స్ర్కిప్ట్ మార్చే పనిలో ఉన్నారంటూ కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయిలే తాజాగా ఆ వార్తాల్లో నిజం లేదని సమాచారం. స్ర్కీప్ట్ పరంగా ఎలాంటి మార్పులు జరగడం లేదని.. ఇటీవల మహేష్ తల్లి ఇందిరా దేవి హఠాన్మరణం చెందడం షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకున్నారని.. ప్రస్తుతం కుటుంబంతో కలిసి వ్యక్తిగత సమయాన్ని గడుపుతున్నారట. త్వరలోనే ఇండియా తిరిగి రానున్నారని.. నవంబర్ నెలలో ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుందట.

ఇవి కూడా చదవండి

ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ మూవీలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటించనున్నారని.. అలాగే మహేష్ మరదలిగా యంగ్ హీరోయిన్ శ్రీలీల కనిపించనుందని టాక్.. అయితే దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.