Samantha: సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయిన సమంత.. చాలా కాలం తర్వాత ఏం పోస్ట్ చేసిందంటే..

దీంతో ఆమె అరుదైన చర్మ సమస్యతో ఇబ్బంది పడుతుందని.. తర్వలోనే చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ సామ్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆమె మేనేజర్ ఇటీవల క్లారిటీ ఇచ్చారు.

Samantha: సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయిన సమంత.. చాలా కాలం తర్వాత ఏం పోస్ట్ చేసిందంటే..
Samantha
Follow us

|

Updated on: Sep 25, 2022 | 10:10 AM

సమంత.. పాన్ ఇండియా లెవల్లో అత్యధిక ఫాలోయింగ్ హీరోయిన్  (Samantha). విడాకుల తర్వాత ఆమె షేర్ ప్రతి పోస్ట్ పట్ల నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా.. సామ్‏కు సంబంధించిన వ్యక్తిగత విషయాలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అయితే డివోర్స్ అనంతరం సామ్ పై ట్రోలింగ్ ఎక్కువగా జరిగింది. తనపై వస్తున్న రూమర్స్ పట్ల ఎంతో హుందంగా స్పందించింది సామ్. ఆ సమయంలోనూ వరుస ప్రాజెక్ట్స్‏కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీ అయ్యింది. ఇక ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేసిన సామ్.. ఆ తర్వాత అనుహ్యంగా సైలెంట్ అయ్యింది. దీంతో ఆమె అరుదైన చర్మ సమస్యతో ఇబ్బంది పడుతుందని.. తర్వలోనే చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ సామ్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆమె మేనేజర్ ఇటీవల క్లారిటీ ఇచ్చారు.

చాలా కాలంగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిన సామ్.. తాజాగా యాక్టివ్ అయినట్లుగా తెలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ వచ్చిన సమంత.. చాలా రోజుల తర్వాత ఇన్ స్టా స్టోరీ షేర్ చేసింది. ఈజిప్టులోని డీజే సోలోమున్ లో నిర్వహించిన ఓ పార్టీలో సామ్ నటించిన ఊ అంటావా మావ తెలుగు సాంగ్‏ను ప్లే చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. మనకు ఇష్టమైన డీజేలలో ఒకరు మన పాటలను ప్లే చేసినప్పుడు మ్యాడ్ నెస్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీలో సామ్ చేసిన ఈ స్పెషల్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది.

ఇవి కూడా చదవండి

సినీ ప్రముఖులే కాకుండా క్రికెటర్స్ సైతం ఈ పాటకు స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ స్టేడియంలోనూ ఊ అంటావా సాంగ్ ప్లే చేశారు. తాజాగా ఈజీప్ట్ డీజేలో తన సాంగ్ ప్లే కావడంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది సామ్. ప్రస్తుతం సమంత ఖుషి, యశోధ చిత్రాల్లో నటిస్తుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.