Rashmika Mandanna: నా హృదయంలో ఆయన స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేరు.. వైరలవుతోన్న రష్మిక ఎమోషనల్ పోస్ట్
కర్ణాటకలో పుట్టి పెరిగిన రష్మిక 2016లో కిర్రిక్ పార్టీ (తెలుగులో కిర్రాక్ పార్టీ) అనే కన్నడసినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత అంజనీ పుత్ర సినిమాలో నటించింది. గతేడాది చివరిలో గుండెపోటుతో మరణించిన దివంగత సూపర్స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈ చిత్రంలో హీరో.

పుష్ప సినిమాతో నేషనల్ లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. కాగా కర్ణాటకలో పుట్టి పెరిగిన రష్మిక 2016లో కిర్రిక్ పార్టీ (తెలుగులో కిర్రాక్ పార్టీ) అనే కన్నడసినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత అంజనీ పుత్ర సినిమాలో నటించింది. గతేడాది చివరిలో గుండెపోటుతో మరణించిన దివంగత సూపర్స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈ చిత్రంలో హీరో. హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై నేటి (డిసెంబర్21)కి ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అప్పు సార్తో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తుకుతెచ్చుకుంది రష్మిక. ఈక్రమంలో సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
‘ఈరోజుతో అంజనీపుత్ర 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నేను పునీత్ రాజ్కుమార్తో జరిగిన సంభాషణలను గుర్తు చేసుకుంటూనే ఉంటా. పునీత్ సార్ నాపై ఎక్కువ నమ్మకంతో ఉండేవారు. ఆయన గొప్ప మనసున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి స్థానాన్ని నామనసులో ఎప్పటికీ భర్తీ చేయలేరు. ఈ సినిమాలో అవకాశం కల్పించిన హర్ష సార్కు థాంక్యూ’ అని తన పోస్ట్లో రాసుకొచ్చింది రష్మిక. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే.. రష్మిక మందన్నా ప్రస్తుతం ‘పుష్ప-2’ చిత్రంలో నటిస్తోంది. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన మిషన్ మజ్ఞు విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు విజయ్ సరసన వారసుడు, రణ్బీర్ కపూర్తో కలిసి యానిమల్ సినిమాల్లో నటిస్తూ బిజిబిజీగా ఉంటోందీ కన్నడ బ్యూటీ.





It’s #5YearsForAnjaniPutra already? I keep thinking about the conversations with @PuneethRajkumar sir and he was more confident in me than myself always. He has the best heart, forever will be irreplaceable in my heart. Thankyou Harsha sir for this film,it means a lot to me.?
— Rashmika Mandanna (@iamRashmika) December 21, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




