AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో పెద్దపులి భయం

ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో పెద్దపులి భయం

Phani CH
|

Updated on: Jan 01, 2026 | 8:08 PM

Share

ములుగు, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాలను పెద్దపులి భయం వెంటాడుతోంది. పందికుంట, కొత్తగూడ, కరీంనగర్ సమీప ప్రాంతాల్లో పులి సంచారాన్ని పాదముద్రల ఆధారంగా గుర్తించారు. అటవీ శాఖ అధికారులు పులి కదలికలను ట్రాక్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు.

ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో పెద్దపులి సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. పందికుంట, కొత్తగూడ అటవీ ప్రాంతాల్లో పులి కదలికలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పందికుంట అడవుల నుంచి కొత్తగూడ అడవుల్లోకి ప్రవేశించినట్లు పాదముద్రల ఆధారంగా నిర్ధారించారు. ప్రస్తుతం కొత్తగూడ రెణ్యాతండా సమీపంలో పులి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అటవీ సిబ్బంది పులి కదలికలను నిరంతరం ట్రాక్ చేస్తున్నారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో సాయంత్రం, రాత్రి, ఉదయం వేళల్లో ఒంటరిగా వెళ్లవద్దని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి

ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో

కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు

ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత

బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..