AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: పెద్ది సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలు గ్యారెంటీ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత గేమ్ ఛేంజర్ మూవీతో అలరించిన చరణ్.. ఇప్పుడు పెద్ది సినిమాలో నటిస్తున్నారు. ఉప్పెన సినిమా భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Ram Charan: పెద్ది సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలు గ్యారెంటీ
Ram Charan
Rajeev Rayala
|

Updated on: Jul 28, 2025 | 7:30 AM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు పెద్ది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు చరణ్. బుచ్చిబాబు సాన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!

ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామాగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి వివిధ ఆటలు ఉంటాయని. రామ్ చరణ్ ఒక ‘ఆట కూలీ’ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో చరణ్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించిన ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. పెద్ది సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ కోసం కండలు పెంచిన రామ్ చరణ్ సరికొత్త లుక్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెద్ది సినిమా నుంచి త్వరలోనే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలోని మొదటి పాట వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 25, 2025న విడుదల కానుందని టాక్. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. . బుచ్చిబాబు రంగస్థలం స్థాయిలో పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌తో సినిమాను తీర్చిదిద్దుతున్నారని, ఇది చరణ్ గ్లోబల్ ఇమేజ్‌ను మరింత పెంచే చిత్రం అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి