AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంత చేయాల్సిన ఆ వెబ్ సిరీస్ ఆగిపోయిందా.. ? క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సామ్.. ఇప్పుడిప్పుడే తిరిగి సినీరంగంలో యాక్టివ్ అవుతుంది. ఇటీవలే శుభం చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది. ఈ చిత్రానికి సమంత నిర్మాత కావడం విశేషం. చిన్న సినిమాగా అడియన్స్ ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంది ఈ చిత్రం. దీంతో ఇప్పుడు సామ్ రాబోయే ప్రాజెక్ట్స్ పై ఆసక్తి నెలకొంది.

Samantha: సమంత చేయాల్సిన ఆ వెబ్ సిరీస్ ఆగిపోయిందా.. ? క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Samantha
Rajitha Chanti
|

Updated on: Jun 26, 2025 | 9:42 AM

Share

సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత.. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత విషయాలు, అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడిన సామ్.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో యాక్టివ్ అవుతుంది. చివరగా ఖుషీ, సిటాడెల్ సినిమాలతో అలరించిన సామ్.. ఇటీవలే శుభం చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది. తన సొంత ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నూతన నటీనటులతో సామ్ చేసిన ప్రయత్నం విజయవంతమైంది. దీంతో సమంత రాబోయే సినిమాలపై ఆసక్తి నెలకొంది. కొన్ని రోజులుగా సామ్ నటించాల్సిన వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్ గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం నడుస్తుంది. బాలీవుడ్ స్టార్ ఆదిత్యరాయ్ కపూర్, సమంత ప్రధాన పాత్రలో నటించాల్సిన ఈ సిరీస్ కు .. దర్శకద్వయం రాజ్, డీకే దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ఇటీవల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా దీనిపై మేకర్స్ స్పందించారు.

“ఎన్నో షెడ్యూళ్లతో ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్ రూపొందిస్తున్నాం. ఇప్పటికే ఇండోర్ టాకీ షెడ్యూల్ దాదాపు పూర్తైంది. ఆ తర్వాత భారీ అవుడ్ డోర్ షెడ్యూల్ ప్లాన్ చేశాం. ఇందులో ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. వాటికి అనుకూలమైన వాతావరణం కోసం వెయిట్ చేస్తున్నాం. వర్షాలు పడే రోజుల్లో వీటిని చిత్రీకరించాలి. అలాగే పచ్చదనం కూడా అవసరం. అందుకే కొన్ని రోజుు ఆగి.. ఇప్పుడు షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నాం” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ సిరీస్ పై వచ్చే రూమర్స్ పై క్లారిటీ వచ్చింది.

ఈ సిరీస్ ఆగిపోయిందంటూ గతంలోనూ అనేకసార్లు వార్తలు వచ్చాయి. ఈ సిరీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దాదాపు రూ.3 కోట్లు దొంగిలించారని… దీంతో ఈ సిరీస్ స్ట్రీమింగ్ చేయనున్న ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ విచారణకు ఆదేశించిందని బీటౌన్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొట్టింది. అయితే గతంలోనూ ఆ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది నిర్మాణ సంస్థ. ఇక ఇప్పుడు మరోసారి ఈ సిరీస్ ఆగిపోయిందంటూ ప్రచారం నడుస్తోంది.

ఇవి కూడా చదవండి : 

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..

Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్‏.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..