AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drug Case: డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన క్రిష్.. శాంపిల్స్ సేకరించిన పోలీసులు.. విచారణలో ఏం చెప్పారంటే..

అనుమానితులుగా ఉన్న డైరెక్టర్ క్రిష్, నీల్, లిషి తదితరులు విచారణకు హాజరుకావాలంటూ ఇప్పటికే అందరికి నోటీసులు పంపించారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ఏ10గా ఉన్న డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరగ్గా.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. దీంతో శుక్రవారం గోప్యంగా విచారణకు హజరయ్యారు. తన స్నేహితుడు చరణ్‏ను కలిసెందుకే పార్టీకి వెళ్లానని.. అక్కడ కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉన్నానని క్రిష్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Drug Case: డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన క్రిష్.. శాంపిల్స్ సేకరించిన పోలీసులు.. విచారణలో ఏం చెప్పారంటే..
Director Krish
Rajitha Chanti
|

Updated on: Mar 02, 2024 | 12:16 PM

Share

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు గచ్చిబౌలి పోలీసులు. అలాగే అనుమానితులుగా ఉన్న డైరెక్టర్ క్రిష్, నీల్, లిషి తదితరులు విచారణకు హాజరుకావాలంటూ ఇప్పటికే అందరికి నోటీసులు పంపించారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ఏ10గా ఉన్న డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరగ్గా.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. దీంతో శుక్రవారం గోప్యంగా విచారణకు హజరయ్యారు. తన స్నేహితుడు చరణ్‏ను కలిసెందుకే పార్టీకి వెళ్లానని.. అక్కడ కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉన్నానని క్రిష్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదన్నారు క్రిష్.

కొద్దిసేపు క్రిష్ ను విచారించిన పోలీసులు అనంతరం రక్త, మూత్ర నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. అనంతరం క్రిష్ మాట్లాడుతూ.. కొద్దిరోజులుగా తాను ముంబైలో ఉన్నానని.. పోలీసులు ఎప్పుడు పిలిచినా వారికి సహకరించేందుకు విచారణకు వస్తానని అన్నారు. నిజానికి వారం ముందే క్రిష్ విచారణకు హాజరుకావాల్సింది. కానీ ఆ సమయంలో తాను ముంబైలో ఉండడం వల్ల విచారణకు హాజరుకాలేనని.. శుక్రవారం వస్తానని పోలీసులకు తెలిపారు. కానీ అనుహ్యంగా విచారణకు ముందే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనపై అనుమానాలు ఎక్కువయ్యాయి..

ఇదిలా ఉంటే.. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న గజ్జల వివేకానంద్, నిర్భయ్, కేదార్ నాథ్ నమునాలు ఇప్పటికే పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న మిగతా 14 మంది కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నీల్, లిషి, శ్వేత్ విదేశాలకు వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నమూనా సేకరణలో ఆలస్యం జరిగే కొద్ది పరీక్షల్లో డ్రగ్స్ ఆనవాళ్లు తొలగిపోతాయనే వారు విచారణకు ఆలస్యమయ్యేలా చేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తన చెల్లెలు లిషి కనిపించడం లేదని టాలీవుడ్ నటి కుషిత గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అందుకే మంగ్లీని టార్గెట్ చేశారు.. నోరువిప్పిన శివ చౌహాన్
అందుకే మంగ్లీని టార్గెట్ చేశారు.. నోరువిప్పిన శివ చౌహాన్
దేశంలో క్యాన్సర్ మరణ మృదంగం.. దడ పుట్టిస్తున్న ICMR నివేదిక
దేశంలో క్యాన్సర్ మరణ మృదంగం.. దడ పుట్టిస్తున్న ICMR నివేదిక
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఆరుగురు మృతి
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఆరుగురు మృతి
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్‌ టాపర్ గా సక్సెస్
నాడు
వీరికి అదే వరం..M అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే వారి గుణ గణాలు ఇవే
వీరికి అదే వరం..M అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే వారి గుణ గణాలు ఇవే
చెక్ మీద సంతకం పెట్టే ముందు ఇవి తెలుసుకోండి.. ఈ తప్పులు చేస్తే..
చెక్ మీద సంతకం పెట్టే ముందు ఇవి తెలుసుకోండి.. ఈ తప్పులు చేస్తే..
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్‌ ఏం చేసాడంటే
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్‌ ఏం చేసాడంటే
బాబోయ్..బట్టలు లేకుండా స్నానం చేస్తున్నారా..
బాబోయ్..బట్టలు లేకుండా స్నానం చేస్తున్నారా..
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే
అల్లరి సినిమా బడ్జెట్, కలెక్షన్స్ గురించి రవిబాబు కామెంట్స్
అల్లరి సినిమా బడ్జెట్, కలెక్షన్స్ గురించి రవిబాబు కామెంట్స్