AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar: ప్రభాస్ కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్.. ఏకంగా అన్ని కోట్ల బడ్జెట్‏తో..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. దాదాపు రెండేళ్లుగా ప్రభాస్ వెండితెరపై కనిపించలేదు. జక్కన్న

Salaar: ప్రభాస్ కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్.. ఏకంగా అన్ని కోట్ల బడ్జెట్‏తో..
Prabas
Rajitha Chanti
|

Updated on: Feb 21, 2022 | 7:17 PM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. దాదాపు రెండేళ్లుగా ప్రభాస్ వెండితెరపై కనిపించలేదు. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి (Bahubali) సినిమాతో ఈ స్టార్ హీరో ఏకంగా పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో డార్లింగ్‏తో సినిమా చేసేందుకు టాలీవుడ్ మాత్రమే కాకుండా.. కోలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ రాధేశ్యామ్.. ఆదిపురుష్ చిత్రాలను పూర్తిచేసిన ప్రభాస్.. ప్రస్తుతం ప్రాజెక్ట్ కే, సలార్ (Salaar), స్పిరిట్ షూటింగ్స్ చేస్తున్నాడు. ఇక ప్రభాస్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే జనవరి 14న విడుదల కావాల్సిన రాధేశ్యామ్ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు కోవిడ్ కారణంగా నిరాశే ఎదురయ్యింది. వేసవిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. ప్రభాస్.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సలార్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. యాక్షన్ థ్రిల్లర్ బ్యాగ్రౌండ్‏లో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ బారీగా పెరిగిపోయిందట. తెలుగు, కన్నడ, భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది. అయితే ముందుగా అనుకున్న దానికంటే సలార్ సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయినట్లుగా వినిపిస్తోంది. ప్రస్తుతం రూ. 200 కోట్లకు పైనే ఈ ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇందులో అత్యధికంగా ప్రభాస్ కే చెల్లించాల్సి వస్తోందట. ఆ తర్వాత యాక్షన్ సన్నివేశాలకు ఖర్చు చేయనున్నారట. అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుందని టాక్ నడుస్తోంది. కానీ ఆ వార్తలన్ని అసత్యాలే అని తేల్చీ చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తే బడ్జెట్ వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారట. దీనిపై త్వరలోనే ప్రకటన రానుందని సమాచారం. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది.

Also Read: Keerthy Suresh: ఫాలోవర్లకు ఛాలెంజ్ చేసిన కళావతి.. అదుర్స్ అనిపిస్తున్న కీర్తి సురేష్ వీడియో..

Aha Indian Idol Telugu: వరల్డ్స్ బిగ్గెస్ట్ మ్యూజికల్ షో.. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో కర్టెన్ రైజర్ కార్యక్రమం..

Viral Video: కూతురిపై ప్రేమతో నాన్న ఇలా చేశాడు..కట్ చేస్తే దెబ్బకు ఫ్యూజులు ఔట్..

Watermelon: పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు తాగితే ప్రమాదమే.. ఎందుకో తెలుసా..