AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akkineni Nagarjuna: అక్కినేని హీరోలతో నటించిన ఏకైక హీరోయిన్.. నాగ్, చైతన్య, అఖిల్ సినిమాల్లో ఆమె చాలా స్పెషల్..

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ తండేల్. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి నటిస్తుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ అయిన టీజర్ ఆసక్తిని కలిగిస్తుంది.

Akkineni Nagarjuna: అక్కినేని హీరోలతో నటించిన ఏకైక హీరోయిన్.. నాగ్, చైతన్య, అఖిల్ సినిమాల్లో ఆమె చాలా స్పెషల్..
Akhil, Nagarjuna, Naga Chai
Rajitha Chanti
|

Updated on: Nov 14, 2024 | 1:16 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. సినీరంగంలో అక్కినేని లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్నారు నాగార్జున. దివంగత హీరో నాగేశ్వర రావు నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ డమ్ అందకున్నారు. 80, 90’s లో నాగార్జున క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అప్పట్లో నాగార్జునకు లేడీ ఫాలోయింగ్ మాములుగా ఉండేది కాదు. టాలీవుడ్ మన్మథుడు అనే ట్యాగ్ లైన్ సైతం ఆయనకే సొంతం. ఇప్పటికీ నాగ్ సినిమాలకు మహిళా అభిమానులు ఎక్కువగా ఉన్నారు. చాలాకాలంగా సరైన హిట్టు కోసం ట్రై చేస్తున్న నాగ్.. సరికొత్త ప్రయోగాలు చేయడంలోనూ ముందుంటారు. ఇక నాగార్జున తర్వాత ఆయన తనయులు సైతం సినీరంగంలో అక్కినేని లెగసీని కాపాడుతున్నారు. నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు.

ప్రస్తుతం అఖిల్ తన కొత్త సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. మరోవైపు నాగచైతన్య డైరెక్టర్ చందూ మొండేటీ దర్శకత్వంలో తండేల్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. లవ్ స్టోరీ సినిమా తర్వాత సాయి పల్లవి, చైతన్య కలిసి నటిస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. అక్కినేని ముగ్గురు హీరోలతో కలిసి నటించిన ఏకైక తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా.. ? .. తను మరెవరో కాదు.. పూజా హెగ్డే. అవును. ఈ ముగ్గురు హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది పూజా హెగ్డే. నాగచైతన్య సరసన ఒక లైలా కోసం.. అఖిల్ జోడిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో నటించింది. ఇక నాగార్జునతో సినిమా చేయలేదు.. కానీ వీరిద్దరు కలిసి ఓ యాడ్ చేశారు. అలా ముగ్గురు హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది పూజా హెగ్డే. చాలా రోజులుగా పూజా హెగ్డే సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.