Thaman: మెగాహీరో సాయి ధరమ్ తేజ్ హెల్త్ పై తమన్ ఎమోషనల్ ట్వీట్.. ఏమన్నాడంటే..

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంలో గాయపడిన విషయం తెల్సిందే.. వినాయక చవితి రోజున సాయి ధరమ్ తేజ్ మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వైపు వెళ్తుండగా..

Thaman: మెగాహీరో సాయి ధరమ్ తేజ్ హెల్త్ పై తమన్ ఎమోషనల్ ట్వీట్.. ఏమన్నాడంటే..
Thaman
Follow us

|

Updated on: Sep 30, 2021 | 4:20 PM

S. Thaman : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంలో గాయపడిన విషయం తెల్సిందే.. వినాయక చవితి రోజున సాయి ధరమ్ తేజ్ మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. రోడ్డు పై ఇసుక ఉండటంతో బైక్ స్కిడ్ అయి పడిపోయాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు తేజ్‏ను సమీపంలోని మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆతర్వాత మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాదంలో తేజ్ షోల్డర్ బోన్ విరగడంతో సర్జరీ చేశారు అపోలో వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

తాజాగా సంగీత దర్శకుడు తమన్ మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. అపోలో లో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడని.. మన ప్రార్ధనలు ఫలిస్తున్నాయని తెలిపారు..  ఇప్పుడు ఆయన ఆరోగ్యం మెరుగు పడిందని అన్నారు తమన్. అలాగే త్వరలో తేజ్‌ను కలవనున్నట్టు తెలిపారు తమన్. నా మిత్రుడిని కలవడానికి చాలా ఆసక్తికి ఎదురుచూస్తున్నా.. త్వరలోనే సాయి ని కలుస్తా అంటూ ట్వీటర్ ద్వార తెలిపారు తమన్. ఇక తేజ్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం 6నుంచి 10 నెలలు పెట్టె అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమాను అక్టోబర్ 1వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు. దర్శకుడు దేవ కట్టా ‘రిపబ్లిక్’ సినిమాను రూపొందించాడు. భగవాన్ – పుల్లారావు నిర్మించిన ఈ సినిమా, రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్‌గా నటించింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Telugu Anchor: ఈ ఫోటోలో ఉన్న తెలుగు యాంకర్ ఎవరో గుర్తించారా..?.. మస్త్ యాక్టివ్

Bigg Boss 5 Telugu: చిక్కుల్లో చిక్కుకోకు అంటూనే చిక్కుల్లోకి నెట్టాడు.. బరువు తగ్గినవారే కెప్టెన్సీకి అర్హులు..

Heroine Sayyeshaa New Photos: నెట్టింట్లో అఖిల్ హీరోయిన్ హల్‏చల్.. లేటెస్ట్ ఫోటోలతో మతి పోగొడుతున్న అందాల ముద్దుగుమ్మ సాయేషా..