Ponniyin Selvan: అసలు ఎవరు ఈ పొన్నియన్ సెల్వన్.. నవలలో ఏముంది.. సినిమాలో ఏం చూపించారు..

పొన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. చోళుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే చాలా సినిమాల్లో చోళులు, పాండ్యుల గురించి చెప్తూ ఉంటారు..

Ponniyin Selvan: అసలు ఎవరు ఈ పొన్నియన్ సెల్వన్.. నవలలో ఏముంది.. సినిమాలో ఏం చూపించారు..
Ponniyin Selvan
Follow us

|

Updated on: Oct 05, 2022 | 12:32 PM

పొన్నియన్ సెల్వన్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది.  మణిరత్నం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పొన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. చోళుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే చాలా సినిమాల్లో చోళులు, పాండ్యుల గురించి చెప్తూ ఉంటారు.. అసలు వీరు ఎవరు, సినిమాలో వచ్చే పాత్రల అసలు చరిత్ర ఏమిటి.? అసలు ఈ పొన్నియన్ సెల్వన్ ఎవరు..?

ఈ నవలకు కథానాయకుడు రాజరాజ చోళుడు. పొన్నియిన్ సెల్వన్ అనేది అతని బిరుదు గుర్తు పెట్టుకోవాలంటే కావేరీపుత్రుడు, కావేరీనదికి మరో పేరు పొన్ని. రాజరాజు ఒకసారి ఆ నదిలో మునిగిపోతూ ఉంటే ఆ నదే అతడిని రక్షించిందట. అందుకే ఇతన్ని పొన్ని నదీపుత్రుడు అంటారు ఈ రాజరాజ పేరు కూడా సింహాసనం ఎక్కాక పెట్టుకున్న పేరు. అతని అసలు పేరైన అరుళ్ మొళి వర్మన్ (రాజరాజు). ఎన్నో మంచి పనులు చేసి, తంజావూరులోని బృహదీశ్వరాలయం కట్టించారు రాజరాజ చోళన్‌. తెలుగువాళ్లకి కనక్షన్ ఉంది. ఇతని దౌహిత్రుడే (కూతురు కొడుకు) మన రాజరాజ నరేంద్రుడు. మాతామహుడి పేరే అతనికి పెట్టారు. అంతటి చక్రవర్తి కుమార్తెను రాజరాజ నరేంద్రుడి తండ్రి ఎలా పెళ్లాడాడు అనేది ప్రశ్న

సినిమా అంతా చోళ, పాండ్య రాజుల చరిత్రను ఆధారం చేసుకుని చేసిన కల్పన. చరిత్రలో స్థూలంగా ఉన్న విషయాలను తీసుకుని, కొన్ని సంఘటనలతో కథ రాశారు. ఎలా జరిగి ఉంటాయో ఊహించుకుని కథ రాసుకున్నారు దర్శకుడు మణిరత్నం. తమిళనాట ఆ కాలంలో నెలకొన్న రాజ్యాల గురించి కాస్త తెలుసుకోవాలి. పల్లవులు కంచిని రాజధానిగా చేసుకుని పాలన చేశారు. దక్షిణ తెలుగు, ఉత్తర తమిళ ప్రాంతాలను క్రీ.శ.300 నుంచి 600 ఏళ్లపాటు ఏలారు. కథాకాలం నాటికి పల్లవుల ప్రభావం క్షీణించింది వారి వంశీకుడు ఒకడు చోళ యువరాజుకి సాయపడ్డాడు.

ఇవి కూడా చదవండి

పల్లవుల తర్వాత ప్రాభవంలోకి వచ్చిన చోళ, పాండ్య, చేర రాజ్యాలు వచ్చారు. తమిళనాడు, కేరళ మాత్రమే కాక శ్రీలంక, ఆగ్నేయాసియా లోని అనేక దేశాలను ఏలారు వీరు. ఒక్కో కాలంలో ఒక్కొక్కరు ఇతరుల ప్రాంతాలను జయించారు. కావేరీ నదీ తీరప్రాంతీయులైన చోళులు చాలాకాలమే ఉన్నారు. 9వ శతాబ్దం మధ్య నుంచి 1300 సం.వరకు అంటే 450 ఏళ్లు బాగా వెలిగారు. వీళ్ల రాజధాని తొలుత పళయారై. తర్వాత తంజావూరుకి మారింది. వైగై నదీ ప్రాంతీయులైన పాండ్యులూ చాలాకాలమే ఉన్నారు.

చోళులతో వాళ్లకు నిత్యఘర్షణ నడిచేది. చోళుల కంటె మరో 50 ఏళ్లు ఎక్కువ వెలిగారు. వాళ్ల రాజధాని మధురై. ఇంచుమించు ఇదే సమయంలో పశ్చిమ తమిళనాడు, మధ్య కేరళ ప్రాంతాలను చేరులు పాలించారు. వాళ్ల రాజధాని మొదట్లో వంచి, తర్వాత కరూరు. ఈ కథలో చేరుల ప్రస్తావన లేదు కథలో చోళప్రత్యర్థులైన రాష్ట్రకూటుల ప్రస్తావన ఉంది . హీరోలు చోళులు, విలన్లు పాండ్యులు

కథాకాలం నాటికి సుందర చోళుడు (రాజు కాకముందు అతని పేరు రెండవ పరాంతక చోళుడు, పరిపాలనా కాలం క్రీ.శ. 962 – 980). అంటే వెయ్యి సంవత్సరాల క్రితం నాటి కథ. ఇక సినిమాలో వీరి పాత్ర విషయానికొస్తే ఈ సుందర చోళుడికి (ప్రకాశ్ రాజ్) ముగ్గురు పిల్లలు. ఆదిత్య కరికాలన్ ( విక్రమ్, ఆదిత్యుడు), కుందవై (త్రిష), అరుళ్‌మొళి వర్మన్ (రాజరాజు, జయం రవి).

ఆదిత్యుడు మహావీరుడు, ఆవేశపరుడు. సుందర చోళుడు గద్దె నెక్కేనాటికి చోళ రాజ్యం క్షీణించి, పాండ్యులది పైచేయిగా ఉంది. సుందరుడు యుద్ధాలు చేసి రాజ్యాన్ని విస్తరింపచేశాడు, తర్వాతి రోజుల్లో పెద్ద సామ్రాజ్యంగా కావడానికి పునాదులు వేశాడు. అతను మరణించిన ఐదేళ్లకు రాజ్యానికి వచ్చిన అతని రెండో కుమారుడు రాజరాజు..29 ఏళ్ల పాటు పాలించి, చక్రవర్తి అయ్యాడు. అతని కుమారుడు రాజేంద్ర చోళుడు. తన 30 ఏళ్ల పాలనలో ఇంకా  విస్తరించి అనేక రాజ్యాలను జయించాడు.

సుందరుడు రాజుగా ఉండే రోజుల్లో ఆదిత్యుడు దళపతిగా ఉన్నాడు. పాండ్య రాజైన వీరపాండ్యుణ్ని చేవూరు యుద్ధంలో ఓడించాడు. అతను పారిపోతే వెంటాడుతూ వెళ్లి అతని తలను తెగ్గోశాడు. దాంతో అతనికి ఆ మేరకు బిరుదు వచ్చింది. అతని తండ్రి అతన్ని యువరాజుగా, తనకు వారసుడిగా చేశాడు. ఆ పదవిపై ఆశ పెట్టుకున్న ఉత్తమ చోళుణ్ని అది మండించింది. వారసత్వం కోసం కుట్రలు జరిగాయి. వీరపాండ్యుడి హత్యకు బదులు తీర్చుకోవాలనుకున్న పాండ్యులు. తమ గూఢచారుల ద్వారా పన్నాగాలు పన్నారు. వారిలో ముఖ్యమైన వాడు ఐంద్రజాలికుడైన రవిదాసన్ (పాత్రధారి కిశోర్) చివరకు క్రీ.శ 969లో ఆదిత్యుడి హత్య జరిగింది.

రాజు కావలసినవాడు హతుడయ్యాడు. దాంతో ఉత్తముడు యువరాజు అయ్యాడు. క్రీ.శ 980లో సుందరుడి మరణం తర్వాత ఉత్తమ చోళుడు ఐదేళ్లు పాలించాడు. క్రీ.శ 985లో అతను మరణించిన తర్వాత రాజరాజు తనే గద్దె కెక్కాడు. ఈ ఆదిత్యుడి హత్య ఎలా జరిగింది? ఎవరు చేయించారు అనేది ఒక పెద్ద మిస్టరీ. దానిపై రకరకాల వాదనలు. పాండ్యులు కుట్ర పన్నారని అనుకున్నా, వారికి సహకరించిన వారెవరు.? ఉత్తమ చోళుడా.? లేక అన్నగారి అడ్డు తొలగించుకోవాలనుకున్న రాజరాజా.? ఆదిత్యుడి హత్య ఫలానా విధంగా జరిగి ఉండవచ్చు అని ఊహించి రాసిన నవల ‘‘పొన్నియిన్ సెల్వన్’’ రాజుల కథలన్నిటిలో లాగానే దీనిలో కూడా కుట్రలు, కూహకాలు రాజుల అక్రమ సంతానాల పగలూ, ప్రేమ-ద్వేషం అన్నీ ఉన్నాయి.

గద్దెపై ఆశ పెట్టుకున్న ఉత్తమ చోళుడు ఎవరు.? అతను సుందరుడికి కజిన్, పెదనాన్నగారి అబ్బాయి, అవుతాడు.  మొదటి పరాంతకుడికి (873-955) ముగ్గురు కొడుకులు. మొదటి కొడుకు చిన్న వయసులోనే చనిపోయాడు. పరాంతకుడు 955లో పోయాక రెండో కొడుకు గండరాదిత్యుడు సింహాసనం ఎక్కాడు ఆరేళ్లు పాలించాక మరణించాడు. అప్పుడు అతని కొడుకు ఉత్తముడు బాగా పసి పిల్లవాడు.. అందుకే గండరాదిత్యుడి తమ్ముడు అరింజయుడు సింహాసనం అధిష్టించాడు. ఒక ఏడాది పాలించి అతను మరణించాడు. అప్పటికింకా ఉత్తముడు పసివాడే కదాని కాబోలు సుందరుడు రాజయ్యాడు కాస్త పెద్దవాడయ్యాక తనను యువరాజు చేస్తాడేమోడని ఉత్తముడు ఆశ పెట్టుకున్నాడు. కానీ సుందరుడు ఉత్తముణ్ని పక్కకు పెట్టి, తన పెద్ద కొడుకు ఆదిత్యుణ్ని యువరాజుగా చేశాడు. అందువలన అతను పగబట్టి, సుందరుణ్ని దింపివేయడానికి ప్రయత్నించాడని నవల అంతే తప్ప ఆదిత్యుణ్ని చంపించినట్లు రాయలేదు.

చరిత్రలో లేని ఒక విషయాన్ని కల్కి ఈ నవలలో కల్పించారు. ఉత్తముడి అసలు పేరు మధురాంతకన్ తండ్రి గండరాదిత్య, తల్లి సెంబియన్ మహాదేవి (జయచిత్ర వేసిన పాత్ర). అతనే ఉత్తముడిగా రాజయ్యాడని చరిత్ర చెపుతోంది. కల్కి మధురాంతకన్‌ను విలన్‌గా చూపి, ఉత్తముడి పేరుతో గద్దె కెక్కినవాడు సెందన్ అముదన్ అనే వ్యక్తి. సుందరుణ్ని పదభ్రష్టుణ్ని చేసి, మధురాంతకుణ్ని రాజుని చేయాలని సామంతరాజులు కుట్ర చేయడం.ఆదిత్యుడి మరణం తర్వాత సుందరుడు మధురాంతకుణ్ని యువరాజుగా ప్రకటించబోతే అతని తల్లి సెంబియన్ మహాదేవి అభ్యంతరం..ఇది మధురాంతకుణ్ని ఆశ్చర్యపరిచింది. నువ్వు నా కన్నతల్లివేనా? అని అడిగాడు అప్పుడామె కాదంటూ గతం చెప్పింది.

ఆమెకు పుట్టిన బిడ్డ పుట్టీపుట్టగానే విగతజీవుడయ్యాడు. అప్పుడామె ఆ పిల్లవాణ్ని ఒక మూగామెకి (ఈమె నందిని తల్లి మందాకినికి కవలసోదరి) ఇచ్చి ఆమె వద్దనున్న పిల్లవాణ్ని తీసుకుని తన పిల్లవాడిగా ప్రకటించి పెంచింది. అతనే మధురాంతకుడు. ఈ మార్పిడి జరిగిన ఐదేళ్లకు మహాదేవి మూగావిడ ఇంటికి వెళితే అక్కడ ఒక ఐదేళ్ల బాబు కనబడ్డాడు. ఆమెకు సందేహం వచ్చి అడిగితే మూగామె ‘మీరు చచ్చిపోయాడనుకున్న శిశువు నిజంగా చచ్చిపోలేదు. మా యింటికి తీసుకుని వచ్చాక బతికాడు నేను పెంచుకుంటున్నాను.’ అంది. అతనే సెందన్ అముదన్ ఇప్పుడతను యువకుడు. మధురాంతకుడు రాజవంశీకుడే కాదు కాబట్టి సింహాసనం ఎక్కడానికి అనర్హుడు.. ఇది వింటూనే మధురాంతకుడు కోపంగా వెళ్లిపోయాడు. మహాదేవి అప్పుడు అముదన్‌ను తన కొడుకుగా ప్రకటించింది సుందరుడు అతన్ని యువరాజుగా చేశాడు.

సుందరుడి మరణం తర్వాత రాజరాజు ఏ పేచీ పెట్టకుండా అముదన్‌నే రాజుగా చేశాడు. అతనే ఉత్తముడనే పేర రాజ్యం చేశాడు. అతని మరణం తర్వాత రాజరాజు సింహాసనం ఎక్కాడు. ఆ మూగామె సోదరి ఐన మందాకినికి మధురాంతకన్‌తో పాటు ఇంకో కూతురు కూడా ఉంది. ఆమె పేరు నందిని (ఐశ్వర్యా రాయ్ వేసిన పాత్ర) దుష్టపాత్ర. చరిత్రలో ఈమె గురించి ఏమీ లేదు. కల్కి కల్పించిన పాత్రే ఇది. ఈమె తండ్రి ఎవరన్నది రచయిత స్పష్టంగా చెప్పలేదు. ఈమె తల్లి మందాకిని అందగత్తెయే కానీ మూగది. కొంతకాలం పాటు సుందరుడు శ్రీలంకలో ఉండగా అతనికి ప్రియురాలిగా ఉండేది

అతను తంజావూరు వచ్చేశాక వీరపాండ్యుడికి ప్రియురాలైంది. మధ్యలో కొంతకాలం మతి పోగొట్టుకుంది. నవల చివరి భాగంలో సుందరుడి అంతఃపురానికి వచ్చి కాస్త గందరగోళాన్ని సృష్టించింది. ఇక నందిని అద్భుత సౌందర్యవతి. ఆదిత్యుణ్ని ప్రేమించి, తర్వాత అతనిపై పగ బూనింది. అతని చావుకి కారకురాలైంది. పాండ్యులతో చేయి కలిపి చోళ వంశాన్ని నాశనం చేయడానికి సమకట్టింది. చోళ సామ్రాజ్యంలో అధికారులుగా ఉన్న నలుగురు పాండ్యుల తరఫున పని చేస్తూ ఆమెకు సాయపడ్డారు.

ఈ కుట్రల గురించి అవీ చెప్పడానికి, పాత్రలను పరిచయం చేయడానికి కల్కి ఒక పాత్రను ఎంచుకున్నారు. అతని పేరు వల్లవరాయన్ వందిదేవన్ (కార్తీ వేసిన పాత్ర). ఆదిత్యుడికి స్నేహితుడు కంచిలో మాతామహుడి దగ్గర ఉన్న ఆదిత్యుడు తాను కట్టిన బంగారు భవనాన్ని చూడడానికి రమ్మనమని తంజావూరులో ఉన్న తండ్రిని, పళయారైలో ఉన్న చెల్లెలు కుందవైని ఆహ్వానిస్తూ ఆ సందేశం వందిదేవుడితో పంపడంతో నవల ప్రారంభమౌతుంది.  అతని ప్రయాణంలో సామంతరాజుల కుట్ర తెలియడం. అనుకోకుండా కుందవైని, గూఢచారి నంబిని కలవడం, నంబి ద్వారా జరిగిన చరిత్రను తెలుసుకుంటారు.

అనాథగా ఉన్న నందిని (ఆమె మధురాంతకుడికి చెల్లెలనే విషయం తర్వాత ఎప్పుడో తెలుస్తుంది) నంబి ఇంటిలోనే  పెరిగింది. నంబి ఆమెను చెల్లిగా భావించాడు. రాజకుటుంబంతో పాటే నందిని పెరిగింది. ఆమె అసమాన సౌందర్యవతి. తలచుకుంటే ఏ మగవాడినైనా ఇట్టే పడగొట్టగలదు. అయితే రాజు కూతురు కుందవై కూడా అందగత్తెయే. పైగా చాలా తెలివైనది. తండ్రికి సలహా లివ్వగలదు. అందరి గౌరవాన్నీ పొందేది. ఆమెను చూసి నందిని కుళ్లుకునేది. ఆదిత్యుడు, నందిని ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ రాచకుటుంబం, ముఖ్యంగా మహాదేవి దాన్ని ఆమోదించలేదు. దాంతో నందిని చోళ రాజ్యంపై పగబట్టింది. హఠాత్తుగా అంతర్ధానమై పోయింది.

ఆదిత్యుడు (విక్రమ్ వేసిన పాత్ర) వీరపాండ్యుణ్ని (నాజర్ వేసిన పాత్ర) యుద్ధంలో ఓడించి అతన్ని తరుముతూ ఒక గుడిసెలోకి వెళ్లినపుడు అతని గాయాలకు సపర్యలు చేస్తూ నందిని కనబడింది. ఆదిత్యుడు ఆశ్చర్యపడ్డాడు. కోపంతో వీరపాండ్యుడిపై కత్తి దూశాడు వద్దువద్దంటూ నందిని అడ్డుపడింది. అయినా వినకుండా ఆదిత్యుడు వీరపాండ్యుడికి శిరచ్ఛేదం చేసి అతని తలను బయటకు పట్టుకుని వచ్చి, అందరికీ ప్రదర్శించి, ప్రశంసలు పొందాడు నందిని పగతో రగిలిపోయింది. వెంటనే చోళ రాజ్యానికి వచ్చి, పెరియ పళవేట్టురాయన్ (శరత్ కుమార్ ఈ  పాత్ర వేశాడు) అనే 60 ఏళ్ల సామంతరాజుని పెళ్లాడింది. అతను చోళరాజ్యానికి కోశాధికారి.. అతను, అతని తమ్ముడు చిన్న పళవేట్టురాయన్ రాజుకి అంతరంగికులు కానీ నందిని మోహంలో పడిన పెరియవన్ తన తమ్ముడితో కలిసి అస్వస్థుడిగా ఉన్న రాజుకి ద్రోహం తలపెడుతున్నాడు. అతన్ని దింపేసి మధురాంతకుణ్ని రాజుగా చేయాలని కుట్రలు పన్నుతున్నాడు.

నేపథ్యం తెలుసుకున్న వందిదేవుడు ఆ తర్వాత రాజుని కలిశాడు. కుందవైను కలిసినప్పుడు ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టం పెంచుకున్నారు. ఆమె కోరికపై చోళ అధీనంలో ఉన్న ఉత్తర శ్రీలంకలో ఉన్న ఆదిత్యుడి తమ్ముడు రాజరాజు వద్దకు పయనించాడు. అక్కడ అతన్ని కలిసి స్నేహితుడయ్యాడు. అక్కడే మందాకినిని చూసి నందినికి ఆమెకు గల పోలికలు గమనించి ఆశ్చర్యపడ్డాడు. ఆదిత్యుడు ఈ  లోపున తన స్నేహితుడైన పార్థిబేంద్ర పల్లవన్‌ను కూడా తమ్ముడి దగ్గరకు పంపాడు. వీళ్లందరూ శ్రీలంకకు సముద్రమార్గం ద్వారానే వెళ్లేవారు. రాజరాజు, వందిదేవుడు, పార్థిబేంద్ర కలిసి బయలుదేరుతూండగా రాజుగారు మిమ్మల్ని బందీలుగా తెమ్మన్నారు అంటూ పెరియవన్ సైన్యం వారిని ఓడ ఎక్కించింది. అక్కడ ఘర్షణ జరిగింది. రాజరాజు ఉన్న ఓడ తుపానులో చిక్కుకుంది అతను మధ్యదారిలో నాగపట్నం వద్ద ఉన్న చూడామణి విహారం అనే బౌద్ధారామంలో తలదాచుకున్నాడు.

నందిని రాజవ్యవహారాలు చర్చించడానికి తనను కడంబూరు రాజభవనంలో కలవమని ఆదిత్యుడికి కబురు పెట్టింది. నందిని కుట్రదారు అని తెలిసినా ఆదిత్యుడు అక్కడకు చేరాడు. అంతకు ముందే వందిదేవుణ్ని నందిని రప్పించింది. అతను చాటుగా దాక్కుని వారి మాటలు విన్నాడు. ఇది కీలకమైన ఘట్టం అనుకోవచ్చు.. అప్పుడే ఆదిత్యుడి హత్య జరిగింది. వందిదేవుడే చంపాడని నేరం ఆరోపించబడింది. నవల క్లైమాక్స్ లో ఎవరు చంపారు, ఏమిటి అనేది తెలుస్తుంది. ఆదిత్యుడి మరణంతో రాజరాజుని యువరాజుని చేద్దామని సుందరుడు అనుకోవడం ..రాజరాజు వచ్చి నేను కాదు మధురాంతకుడే యువరాజు కావాలనడం.. మహాదేవి మధురాంతకుడు నా కొడుకు కాదు, అముదనే అనడంతో అతన్ని యువరాజుని చేయడంతో నవల ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!