Tollywood: ప్రపంచ సుందరిని వరించని అదృష్టం.. కలిసిరాని అవకాశాలు.. హిట్టు కొట్టేదేప్పుడో..

ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచినా ఇండస్ట్రీలో మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు. 2017లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే మోడల్‌గా సక్సెస్ అయిన ఆ అమ్మడు మాత్రం ఇండస్ట్రీలో ఫ్లాప్ స్టార్‌గా మిగిలిపోయింది. ఇప్పటి వరకు ఆమె నటించిన 4 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా ..?

Tollywood: ప్రపంచ సుందరిని వరించని అదృష్టం.. కలిసిరాని అవకాశాలు.. హిట్టు కొట్టేదేప్పుడో..
Actress
Follow us

|

Updated on: Apr 23, 2024 | 5:19 PM

మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సినీపరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందాల పోటీల్లో గెలిచి సినిమా రంగంలోనూ టాప్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలుగుతున్న తారల గురించి చెప్పక్కర్లేదు. ఐశ్వర్యరాయ్, సుస్మితా సేన్, ప్రియాంక చోప్రా, లారా దత్తా వంటి అందాల తారలు వెండితెరపై తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచినా ఇండస్ట్రీలో మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు. 2017లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే మోడల్‌గా సక్సెస్ అయిన ఆ అమ్మడు మాత్రం ఇండస్ట్రీలో ఫ్లాప్ స్టార్‌గా మిగిలిపోయింది. ఇప్పటి వరకు ఆమె నటించిన 4 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా ..? తనే హీరోయిన్ పేరు మానుషి చిల్లార్.

హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ చైనాలో మిస్ యూనివర్స్ 2017 కిరీటాన్ని గెలుచుకుంది. ఈ గౌరవాన్ని అందుకున్న ఆరో భారతీయ మహిళగా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ లో ఆఫర్లు వచ్చాయి. 2022లో విడుదలైన హిస్టారికల్ డ్రామా ‘సామ్రాట్ పృథ్వీరాజ్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీకి చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సంయోగిత అనే యువరాణి పాత్రలో మానుషి నటించింది. రూ.220 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అలాగే మానుషి నటించిన రెండవ చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’. ఈ సినిమాలో విక్కీ కౌశల్ హీరోగా నటించగా.. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించాడు. రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ కేవలం రూ.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అయినా మానుషికి ఆఫర్స్ వచ్చాయి.

ఇటీవల వరుణ్ తేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’లో మానుషి నటించింది. శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన ఈ మూవిని తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయగా.. బాక్సాఫీస్ వద్ద రూ.8 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అలాగే ఇటీవల అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ బడే మియా చోటే మియాలో ఈ బ్యూటీ కనిపించింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇలా వరుస ప్లాపులతో ఇండస్ట్రీలో సతమతమవుతుంది మానుషిక. కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం ఇప్పుడు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈ అందాల రాశికి బ్రేక్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.