Jr NTR: బాలీవుడ్ పార్టీలో యంగ్ టైగర్.. సతీసమేతంగా హాజరైన తారక్

విదేశాల్లోనూ తారక్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు తారక్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నారు తారక్. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

Jr NTR: బాలీవుడ్ పార్టీలో యంగ్ టైగర్.. సతీసమేతంగా హాజరైన తారక్
Ntr
Follow us

|

Updated on: Apr 29, 2024 | 2:48 PM

జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కేవలం టాలీవుడ్ టాప్ హీరో మాత్రమే కాదు.. పాన్ ఇండియా స్టార్. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. విదేశాల్లోనూ తారక్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు తారక్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నారు తారక్. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.  ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు బాలీవుడ్ మూవీ వార్ 2లోనూ నటిస్తున్నాడు తారక్.

హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన వార్ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా వార్ 2ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరిగుతోంది.  ‘వార్ 2’ షూటింగ్ కోసం ముంబైలో ఉన్నాడు తారక్ . ఈ క్రమంలోనే బాలీవుడ్‌లోని ప్రముఖులతో కలిసి ఓ డిన్నర్ పార్టీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి.

ముంబైలోని ఓ హోటల్‌లో జరిగిన పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ఆయన సతీమణి లక్ష్మీ ప్రణీత, హృతిక్ రోషన్, అతని స్నేహితురాలు సభా ఆజాద్, అలియా భట్, ఆమె భర్త రణబీర్ కపూర్, బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఇలా చాలా మంది సెలబ్రెటీలు హాజరయ్యారు. హోటల్‌లో పెద్ద సెలబ్రిటీలు కనిపించారు కాబట్టి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు.ఇంతమంది సెలబ్రెటీలు రావడంతో హోటల్ దగ్గర భారీగా అభిమానులు చేరుకున్నారు. ఎన్టీఆర్ ను చూడగానే ఓ లేడీ అభిమాని సార్ ఈ రోజు నా పుట్టిన రోజు అంటూ అరిచింది. దాంతో వెంటనే తారక్ ఆమెను పిలిచి ఆమెతో ఫోటో దిగాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వార్ 2 విషయానికొస్తే.. యశ్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా కిరాయి అద్వానీ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.