Jr NTR: పుట్టిన రోజు ముందే అమ్మ కలను నిజం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. త‌ల్లితో క‌లిసి ఆ ప్రముఖ దేవాలయానికి..

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్‌ ను దర్శించుకున్నారు. అతని వెంట ఆమె తల్లి, కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా స్వ‌యంగా ఎన్టీఆరే వెల్ల‌డించారు. ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ విజిట్ కు సంబంధించి న ఫొటోలు షేర్ చేస్తూ..

Jr NTR: పుట్టిన రోజు ముందే అమ్మ కలను నిజం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. త‌ల్లితో క‌లిసి ఆ ప్రముఖ దేవాలయానికి..
Jr NTR, Rishab Shetty
Follow us

|

Updated on: Aug 31, 2024 | 5:22 PM

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్‌ ను దర్శించుకున్నారు. అతని వెంట ఆమె తల్లి, కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా స్వ‌యంగా ఎన్టీఆరే వెల్ల‌డించారు. ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ విజిట్ కు సంబంధించి న ఫొటోలు షేర్ చేస్తూ.. అమ్మ‌ పుట్టిన రోజుకు కేవ‌లం రెండు రోజుల ఇలా చేయ‌డం ఆమెకు తానిచ్చిన అత్యుత్త‌మ బ‌హుమ‌తి అని ఎమోషనల్ అయ్యాడు. ‘నన్ను తన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలనే మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది! సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజుకు ముందు జరిగేలా చేయడం నేను ఆమెకు ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి’ అని ఎన్టీఆర్ సామాజిక మాధ్యమాల వేదికగా రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్‌గా మారాయి. కాగా రిషబ్ శెట్టి ఎన్టీఆర్, అతని తల్లిని స్వయంగా ఉడిపికి తీసుకెళ్లి దర్శనం చేయించారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి స్వస్థలం ఉడిపి. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కు కర్ణాటకతో ప్రత్యేక బంధం ఉంది. కన్నడలో కూడా అనర్గళంగా మాట్లాడగలడు తారక్. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి కన్నడ చిత్ర పరిశ్రమతో ప్రత్యేక అనుబంధం ఉంది. పునీత్ రాజ్‌కుమార్, జూనియర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు. అప్పు అంతిమ సంస్కారాల్లోనూ పాల్గొన్నారు తారక్. ఇప్పుడు రిషబ్ శెట్టితో కలిసి ఉడిపి కృష్ణుడిని దర్శించుకోవడానికి వచ్చారు.

ఇక ఎన్టీఆర్, రిషబ్ శెట్టిల మధ్య మంచి అనుబంధం ఉంది. ఇటీవల జాతీయ అవార్డును సొంతం చేసుకున్న రిషబ్ కు అభినందనలు కూడా తెలిపాడు తారక్. ఇక సినిమాల విషయానికి వస్తే…

ఇవి కూడా చదవండి

ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ లో ఎన్టీఆర్ ఫ్యామిలీ..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Jr NTR (@jrntr) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే చిత్రంలో జూ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. పూజా కార్యక్రమాలతో ఇటీవలే ఈ సినిమా ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని, ఈ సినిమా షూటింగ్ కంటే ముందే దేవుడి దర్శనం, ఆశీస్సులు పొందేందుకు జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటకకు వచ్చారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే హిందీలో హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్’ సినిమా షూటింగ్‌ లోనూ తారక్ పాల్గొనాల్సి ఉంది.

రిషబ్, ప్రశాంత్ నీల్ లతో ఎన్టీఆర్..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Jr NTR (@jrntr) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్