Actress: మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాంతో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ?.. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్..

చంద్రబింబంలాంటి మోముతో.. చారడేసి కళ్లతో ఎంతో అందంగా ఉంటుంది. ఈ అమ్మాయి నార్త్ ఇండియన్. అయినా దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

Actress: మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాంతో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ?.. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్..
Actress
Follow us

|

Updated on: Oct 01, 2022 | 5:54 PM

పైన ఫోటోలో మిస్సైల్ మ్యాన్.. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి. ఇప్పుడు ఈ చిన్నది తెలుగులో క్రేజీ హీరోయిన్. అందం, అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మీకోసం మరో క్లూ. ప్రస్తుతం ఈ అమ్మాయి.. చంద్రబింబంలాంటి మోముతో.. చారడేసి కళ్లతో ఎంతో అందంగా ఉంటుంది. ఈ అమ్మాయి నార్త్ ఇండియన్. అయినా దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అందం ఏంత ఉన్నా.. అదృష్టం మాత్రం ఇసుమంతైన లేదు. వరుస సూపర్ హిట్ చిత్రాల్లో నటించినా.. ఈ ముద్దుగుమ్మకు మాత్రం అవకాశాలు రావడం లేదు. దీంతో కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. వెండితెరకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో ముచ్చటిస్తుంది ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి.

ఈ చిన్నది ముందుగా తమిళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. కోలీవుడ్ ఇండస్ట్రీలోనే మొదటిసారి ఏకంగా మూడు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులోకి అరంగేట్రం చేసింది. గుర్తుపట్టారా ? ఆ ముద్దుగుమ్మ ఎవరంటే…బ్యూటీఫుల్ గర్ల్ సురభి. బీరువా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు.. ఎక్స్ ప్రెస్ రాజా, ఎటాక్, జెంటిల్మెన్, ఒక్క క్షణం, శశి వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. చివరిసారిగా ఆ సురభి శశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అందం, అభినయంతో మెప్పించినా.. సురభికి మాత్రం అవకాశాలు కలిసి రావడం లేదు.

ఇవి కూడా చదవండి

తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఎర్ర గులాబీ సైతం అసూయ పడే అందంతో కుర్రాళ్ల మనసులను దొచేస్తుంది. ఈ క్రమంలోనే సురభికి సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ కూడా నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.